తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు అనీల్ రావిపూడి. నాలుగో సినిమా F2 తో బ్లాక్ బస్టర్ అందుకొని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరు తీసి డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడి తీస్తున్న F3 గురించి ఇండస్ట్రీలో పెద్దగా బజ్ లేకపోగా నెగిటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ మళ్ళీ అదే కామెడీ కంటెంట్ రిపీట్ చేసి ఈ సీక్వెల్ తీస్తున్నారా ? అనేది ఆడియన్స్ కామెంట్.
తాజాగా రిలీజైన టీజర్ , సాంగ్స్ చూస్తే అనిల్ రావిపూడి తన మేజిక్ తో మళ్ళీ అదే సినిమా తీస్తున్నారా ? అనిపిస్తుంది. F2 కి F3 పెద్దగా తేడా ఉండదేమో అనే సందేహాలు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. పైగా F2 లో అనసూయతో ఐటెం సాంగ్ పెట్టినట్టే ఇప్పుడు ఇందులో కూడా ఓ ఐటెం సాంగ్ పెట్టి పూజతో హాట్ స్టెప్స్ వేయించారు. వెంకీ రే చీకటి – వరుణ్ నత్తి ఎలిమెంట్స్ తప్ప మిగతాది అంతా రొటీన్ గానే ఉండబోతుందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
నిజానికి ఒక సెక్టార్ ఆడియన్స్ కి F2 సెకండాఫ్ నచ్చలేదు. ఇప్పటికీ కొందరు ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయ్యిందో అంటూ పెదవి విరుస్తుంటారు.
అయితే అనీల్ టాలెంట్ ని తక్కువ అంచనా వేయలేము. తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ తో ఏదో మేజిక్ చేసి ఫైనల్ గా మెప్పిస్తాడు. ఒకరకంగా కామెడీతో మెప్పించడం కూడా గొప్పే.
జబర్దస్త్ కామెడీ ని డామినేట్ చేసి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి నవ్వించడం అంటే మాములు విషయం కాదు అందుకే అనిల్ ని ఒకప్పటి జంధ్యాల . ఇవీవీ లతో పోలుస్తారు. ఇక F2 కంటే F3 లో మరింత హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేశానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు అనిల్. మరి ఈ సీక్వెల్ తో మరో బ్లాక్ బస్టర్ కొడితే అనిల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…