తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు అనీల్ రావిపూడి. నాలుగో సినిమా F2 తో బ్లాక్ బస్టర్ అందుకొని వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరు తీసి డిమాండ్ ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడి తీస్తున్న F3 గురించి ఇండస్ట్రీలో పెద్దగా బజ్ లేకపోగా నెగిటివ్ కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ మళ్ళీ అదే కామెడీ కంటెంట్ రిపీట్ చేసి ఈ సీక్వెల్ తీస్తున్నారా ? అనేది ఆడియన్స్ కామెంట్.
తాజాగా రిలీజైన టీజర్ , సాంగ్స్ చూస్తే అనిల్ రావిపూడి తన మేజిక్ తో మళ్ళీ అదే సినిమా తీస్తున్నారా ? అనిపిస్తుంది. F2 కి F3 పెద్దగా తేడా ఉండదేమో అనే సందేహాలు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. పైగా F2 లో అనసూయతో ఐటెం సాంగ్ పెట్టినట్టే ఇప్పుడు ఇందులో కూడా ఓ ఐటెం సాంగ్ పెట్టి పూజతో హాట్ స్టెప్స్ వేయించారు. వెంకీ రే చీకటి – వరుణ్ నత్తి ఎలిమెంట్స్ తప్ప మిగతాది అంతా రొటీన్ గానే ఉండబోతుందేమో అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
నిజానికి ఒక సెక్టార్ ఆడియన్స్ కి F2 సెకండాఫ్ నచ్చలేదు. ఇప్పటికీ కొందరు ఆ సినిమా అంత పెద్ద హిట్ ఎలా అయ్యిందో అంటూ పెదవి విరుస్తుంటారు.
అయితే అనీల్ టాలెంట్ ని తక్కువ అంచనా వేయలేము. తనలో ఉన్న రైటింగ్ టాలెంట్ తో ఏదో మేజిక్ చేసి ఫైనల్ గా మెప్పిస్తాడు. ఒకరకంగా కామెడీతో మెప్పించడం కూడా గొప్పే.
జబర్దస్త్ కామెడీ ని డామినేట్ చేసి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి నవ్వించడం అంటే మాములు విషయం కాదు అందుకే అనిల్ ని ఒకప్పటి జంధ్యాల . ఇవీవీ లతో పోలుస్తారు. ఇక F2 కంటే F3 లో మరింత హిలేరియస్ ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేశానని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకున్నాడు అనిల్. మరి ఈ సీక్వెల్ తో మరో బ్లాక్ బస్టర్ కొడితే అనిల్ గ్రాఫ్ ఇంకా పెరుగుతుంది.
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…