ఒక స్టార్ హీరో సినిమాలో ఆ హీరోకు జోడీగా కథానాయిక లేకపోవడం అంటే టాలీవుడ్లో అసలు జరగని పని. ఎంత సీరియస్ సినిమా అయినా.. కథాంశం ఎలాంటిదైనా హీరోకు జోడీగా హీరోయిన్ ఉండాల్సిందే. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ లేకపోవడం అంటే ఏదో వెళితిగా ఉంటుంది. కెరీర్ ఆరంభంలో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసినపుడు హీరోయిన్ లేకుండా కొన్ని సినిమాలు లాగించేశారు కానీ.. స్టార్ ఇమేజ్ వచ్చాక మాత్రం చిరు ఎప్పుడూ కథానాయిక లేకుండా సినిమాలు చేసింది లేదు.
ఎంత వెతికి వెతికి చూసినా స్టార్ అయ్యాక చిరు కెరీర్లో అలాంటి సినిమా కనిపించదు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆచార్య సినిమాలో ఆయనకు కథానాయిక లేకుండా పోయింది. ఐతే ఇది ముందు అనుకుని చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగిపోయింది.
ఆచార్య సినిమాలో కథానాయికగా ముందు కాజల్ అగర్వాల్ను ఎంపిక చేయడం, ఆమె మీద కొన్ని సన్నివేశాలు, లాహే లాహే పాట షూట్ చేయడం తెలిసిందే. లాహే లాహే ప్రోమోలో కూడా ఆమె కనిపించింది. కానీ మధ్యలో కథ మారిపోయింది. ఆచార్య పాత్రకు ప్రేయసిని పెట్టడం వల్ల తన పాత్ర దెబ్బ తింటుందని, అలాగే కాజల్ లాంటి పెద్ద హీరోయిన్ని పెట్టి దానికి సరైన ముగింపునివ్వకుంటే, నామమాత్రంగా లాగించేస్తే బాగుండదని ఆమె పాత్రను తీసేసినట్లు కొరటాల శివ వెల్లడించడం తెలిసిందే.
అలా చిరుకు హీరోయిన్ని పెట్టి కూడా తీసేయాల్సి వచ్చింది. ఫైనల్గా హీరోయిన్ లేకుండా చిరు సినిమా ఒకటి విడుదల కాబోతోంది. దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా బంగారంలో అతడికి హీరోయిన్ని పెట్టలేదు. అందులో మీరా చోప్రా నటించినా.. ఆమె పవన్కు జోడీ కాదు. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఐతే సినిమాలో విషయం లేక అది పోయింది కానీ.. హీరోయిన్ లేకపోవడం వల్ల అనలేం. కాబట్టి ఆచార్య విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on April 27, 2022 12:55 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…