ఒక స్టార్ హీరో సినిమాలో ఆ హీరోకు జోడీగా కథానాయిక లేకపోవడం అంటే టాలీవుడ్లో అసలు జరగని పని. ఎంత సీరియస్ సినిమా అయినా.. కథాంశం ఎలాంటిదైనా హీరోకు జోడీగా హీరోయిన్ ఉండాల్సిందే. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమాలో ఆయన పక్కన హీరోయిన్ లేకపోవడం అంటే ఏదో వెళితిగా ఉంటుంది. కెరీర్ ఆరంభంలో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసినపుడు హీరోయిన్ లేకుండా కొన్ని సినిమాలు లాగించేశారు కానీ.. స్టార్ ఇమేజ్ వచ్చాక మాత్రం చిరు ఎప్పుడూ కథానాయిక లేకుండా సినిమాలు చేసింది లేదు.
ఎంత వెతికి వెతికి చూసినా స్టార్ అయ్యాక చిరు కెరీర్లో అలాంటి సినిమా కనిపించదు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆచార్య సినిమాలో ఆయనకు కథానాయిక లేకుండా పోయింది. ఐతే ఇది ముందు అనుకుని చేసింది కాదు. అనుకోకుండా అలా జరిగిపోయింది.
ఆచార్య సినిమాలో కథానాయికగా ముందు కాజల్ అగర్వాల్ను ఎంపిక చేయడం, ఆమె మీద కొన్ని సన్నివేశాలు, లాహే లాహే పాట షూట్ చేయడం తెలిసిందే. లాహే లాహే ప్రోమోలో కూడా ఆమె కనిపించింది. కానీ మధ్యలో కథ మారిపోయింది. ఆచార్య పాత్రకు ప్రేయసిని పెట్టడం వల్ల తన పాత్ర దెబ్బ తింటుందని, అలాగే కాజల్ లాంటి పెద్ద హీరోయిన్ని పెట్టి దానికి సరైన ముగింపునివ్వకుంటే, నామమాత్రంగా లాగించేస్తే బాగుండదని ఆమె పాత్రను తీసేసినట్లు కొరటాల శివ వెల్లడించడం తెలిసిందే.
అలా చిరుకు హీరోయిన్ని పెట్టి కూడా తీసేయాల్సి వచ్చింది. ఫైనల్గా హీరోయిన్ లేకుండా చిరు సినిమా ఒకటి విడుదల కాబోతోంది. దీన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమా బంగారంలో అతడికి హీరోయిన్ని పెట్టలేదు. అందులో మీరా చోప్రా నటించినా.. ఆమె పవన్కు జోడీ కాదు. ఇది ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఐతే సినిమాలో విషయం లేక అది పోయింది కానీ.. హీరోయిన్ లేకపోవడం వల్ల అనలేం. కాబట్టి ఆచార్య విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on April 27, 2022 12:55 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…