టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ కొన్నేళ్ల కిందట రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి.. ఇలా వరుస విజయాలతో మంచి ఊపు మీదుండగా.. ‘రాధ’ అనే సినిమా చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మాంచి స్పీడుమీదున్న అతడి కెరీర్కు స్పీడ్ బ్రేకర్లా మారిందా చిత్రం. శర్వా తొలిసారి పోలీస్ పాత్రలో నటించిన ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు చంద్రమోహన్. తొలి సినిమాతో పరాజయం ఎదుర్కొంటే కోలుకోవడం అంత తేలిక కాదు. చంద్రమోహన్ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. తొలి సినిమా రిలీజైన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను వార్తల్లోకి వచ్చాడు. ఈసారి చంద్రమోహన్ ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సిరీస్ పేరు.. ఏటీఎం. జీ5 కోసం చంద్రమోహన్ రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్.. ఏటీఎం. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్కు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ రెడ్డి, ఆయన కూతురు హన్సిత రెడ్డి ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఫణి కందుకూరి రైటర్ కాగా.. చంద్రమోహన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి వడిత్యా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. కొత్త వాళ్లు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చి కీలక పాత్రలకు ఆర్టిస్టులను తీసుకున్నారు. ఏటీఎం అనే టైటిల్ చూస్తేనే ఇది డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ సిరీస్ అని అర్థమైపోతోంది. డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాలని హరీష్ శంకర్ ఎప్పట్నుంచో చూస్తున్నాడు. యువ దర్శకులకు అవకాశమిచ్చి ఓటీటీల కోసం ఒరిజినల్స్ చేయాలన్న ఆయన ప్రయత్నం ఎట్టకేలకు ఫలిస్తోంది. మరి ఈ సిరీస్తో హరీష్ అండ్ టీం ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on April 26, 2022 8:41 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…