టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ కొన్నేళ్ల కిందట రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి.. ఇలా వరుస విజయాలతో మంచి ఊపు మీదుండగా.. ‘రాధ’ అనే సినిమా చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మాంచి స్పీడుమీదున్న అతడి కెరీర్కు స్పీడ్ బ్రేకర్లా మారిందా చిత్రం. శర్వా తొలిసారి పోలీస్ పాత్రలో నటించిన ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు చంద్రమోహన్. తొలి సినిమాతో పరాజయం ఎదుర్కొంటే కోలుకోవడం అంత తేలిక కాదు. చంద్రమోహన్ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. తొలి సినిమా రిలీజైన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను వార్తల్లోకి వచ్చాడు. ఈసారి చంద్రమోహన్ ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సిరీస్ పేరు.. ఏటీఎం. జీ5 కోసం చంద్రమోహన్ రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్.. ఏటీఎం. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్కు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ రెడ్డి, ఆయన కూతురు హన్సిత రెడ్డి ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఫణి కందుకూరి రైటర్ కాగా.. చంద్రమోహన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి వడిత్యా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. కొత్త వాళ్లు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చి కీలక పాత్రలకు ఆర్టిస్టులను తీసుకున్నారు. ఏటీఎం అనే టైటిల్ చూస్తేనే ఇది డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ సిరీస్ అని అర్థమైపోతోంది. డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాలని హరీష్ శంకర్ ఎప్పట్నుంచో చూస్తున్నాడు. యువ దర్శకులకు అవకాశమిచ్చి ఓటీటీల కోసం ఒరిజినల్స్ చేయాలన్న ఆయన ప్రయత్నం ఎట్టకేలకు ఫలిస్తోంది. మరి ఈ సిరీస్తో హరీష్ అండ్ టీం ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on April 26, 2022 8:41 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…