టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ కొన్నేళ్ల కిందట రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి.. ఇలా వరుస విజయాలతో మంచి ఊపు మీదుండగా.. ‘రాధ’ అనే సినిమా చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్న సంగతి గుర్తుండే ఉంటుంది. మాంచి స్పీడుమీదున్న అతడి కెరీర్కు స్పీడ్ బ్రేకర్లా మారిందా చిత్రం. శర్వా తొలిసారి పోలీస్ పాత్రలో నటించిన ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు చంద్రమోహన్. తొలి సినిమాతో పరాజయం ఎదుర్కొంటే కోలుకోవడం అంత తేలిక కాదు. చంద్రమోహన్ మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. తొలి సినిమా రిలీజైన ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అతను వార్తల్లోకి వచ్చాడు. ఈసారి చంద్రమోహన్ ఒక వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఆ సిరీస్ పేరు.. ఏటీఎం. జీ5 కోసం చంద్రమోహన్ రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్.. ఏటీఎం. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్కు కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. దిల్ రాజు మేనల్లుడు హర్షిత్ రెడ్డి, ఆయన కూతురు హన్సిత రెడ్డి ఈ సిరీస్ను నిర్మిస్తున్నారు. ఫణి కందుకూరి రైటర్ కాగా.. చంద్రమోహన్ స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి వడిత్యా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. కొత్త వాళ్లు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చి కీలక పాత్రలకు ఆర్టిస్టులను తీసుకున్నారు. ఏటీఎం అనే టైటిల్ చూస్తేనే ఇది డబ్బు చుట్టూ తిరిగే క్రైమ్ సిరీస్ అని అర్థమైపోతోంది. డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాలని హరీష్ శంకర్ ఎప్పట్నుంచో చూస్తున్నాడు. యువ దర్శకులకు అవకాశమిచ్చి ఓటీటీల కోసం ఒరిజినల్స్ చేయాలన్న ఆయన ప్రయత్నం ఎట్టకేలకు ఫలిస్తోంది. మరి ఈ సిరీస్తో హరీష్ అండ్ టీం ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on April 26, 2022 8:41 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…