పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే.. ఎందుకీ వృథా ప్రయాస అన్నట్లే చూశారు చాలామంది. అల్లు అర్జున్కు డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన కాస్త గుర్తింపు వచ్చినంత మాత్రాన తన సినిమాను ఒకేసారి హిందీలో రిలీజ్ చేసేంత సీన్ ఉందా అని కౌంటర్లు వేశారు. అందులోనూ పుష్ప రిలీజ్ ముంగిట నార్త్ ఇండియాలో పెద్దగా ప్రమోషన్లు కూడా లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తేదేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కట్ చేస్తే పుష్ప హిందీలో సంచలనం సృష్టించింది. దాదాపు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది. అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతూ పోవడం, దీని ధాటికి 83 లాంటి పెద్ద హిందీ సినిమా దెబ్బ తినడం ఎవ్వరూ ఊహించలేదు. సినిమా హిట్టవడం ఒకెత్తయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగులు, ఇంకా పాటలు ఉత్తరాదిన మారు మూల ప్రాంతాల్లోకి వెళ్లిపోవడం.. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా పుష్ప మేనియాతో ఊగిపోవడం మరో ఎత్తు.
సెలబ్రెటీలు ఎంతోమంది పుష్ప మేనరిజమ్స్, డైలాగులను అనుకరించడం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ఆల్ టైం గ్రేట్ అమితాబ్ బచ్చన్ నోటి నుంచి కూడా పుష్ప డైలాగ్ రావడం విశేషం. బిగ్-బి నిర్వహించే కౌన్ బనేగా కరోడ్పతి కొత్త సీజన్కు సంబంధించిన ప్రోమోలో.. పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజే క్యా.. మై ఫ్లవర్ నహి ఫైర్.. అంటూ పుష్ప హిందీ వెర్షన్లో బాగా పాపులర్ అయిన డైలాగ్ను ఆయన ఈ ప్రోమోలో పలికారు.
అంతే కాక ఈ ప్రోమోలో పుష్ప సినిమాలో చూపించే ఎర్రచందనం దొరికే అడవులు ఏవి అంటూ ప్రశ్న అడిగి ఆప్షన్లు కూడా ఇచ్చారు. కేబీసీ కొత్త సీజన్లో పాల్గొనడానికి ఈ ప్రశ్నకు జవాబివ్వాలని కోరారు. ఇంతటి పాపులర్ షో సంబంధించిన ప్రోమోలో పుష్ప సినిమాలోని అంశంపై ప్రశ్న అడగడం.. బిగ్-బి బన్నీ డైలాగ్ను ఉచ్ఛరించడం.. దీన్ని బట్టి పుష్ప సినిమా నార్త్ ఇండియాలో ఏ స్థాయిలో పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 24, 2022 10:03 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…