ఒక పెద్ద సినిమాకు సంబంధించి ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగితే ఆ చిత్ర కథానాయిక ఆ వేడుకకు హాజరు కాలేని పరిస్థితి ఉంటే.. తన ఏవీ అయినా అందులో ప్రదర్శిస్తారు. వీడియో బైట్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అది కూడా వీలు కానపుడు కనీసం చిత్ర బృందంలోని ముఖ్యులు కచ్చితంగా ఆమె ప్రస్తావన తెస్తారు. తను స్పందించలేని పరిస్థితి గురించి వివరణ ఇస్తారు.
కానీ ‘ఆచార్య’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కాజల్ గురించి ఎవ్వరూ ఒక్క ముక్కా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ప్రధాన కథానాయిక కాజలే అన్న సంగతి తెలిసిందే. ఆమె చిరంజీవికి జోడీగా నటించింది. ‘లాహే లాహే’ పాటలో ఆమె స్టెప్పులు చూశాం. ఈ చిత్ర షూటింగ్కు హాజరైనపుడు లొకేషన్లో కాజల్, ఆమె భర్తకు చిరు సత్కారం చేయడం గుర్తుండే ఉంటుంది.
ఇక డెలివరీకి సిద్ధమవుతున్నప్పటికీ తాను ప్రమోషన్ల కోసం వీడియో బైట్ ఇస్తానని కాజల్ అంటే.. చిరు, చరణ్ ఇలాంటి టైంలో అంత ఇబ్బంది ఎందుకంటూ వారించారని వార్తలొచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు కానీ, చరణ్ కానీ, మిగతా ముఖ్యులెవరు కానీ కాజల్ ప్రస్తావనే తేలేదు. ఎవరో ఒకరు పేరు విస్మరిస్తే మరిచిపోయారు అనుకోవచ్చు. కానీ సినిమాలో కథానాయికగా నటించిన అమ్మాయి పేరును అందరూ విస్మరించడం సందేహాలకు తావిస్తోంది.
అసలీ సినిమాలో కాజల్ పాత్రను ఉంచారా, తీసేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆచార్య’ చిత్రీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉండగానే.. కాజల్ గర్భం దాల్చిన నేపథ్యంలో ఆమెపై మిగిలిన సన్నివేశాలు తీయలేని పరిస్థితుల్లో తన పాత్రను నామమాత్రంగా మార్చేశారేమో, ఆమెకు కథానాయిక స్థానం ఇవ్వలేదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పాత్రను పక్కన పెట్టారు కాబట్టే ఆమె సినిమాలో కీలక పాత్ర పోషించిన ఫీలింగ్ రాకుండా అందరూ తన పేరును విస్మరించారేమో అన్న చర్చ నడుస్తోందిప్పుడు. కాబట్టి ‘ఆచార్య’ సినిమా చూస్తే కానీ.. కాజల్ విషయంలో టీం వ్యవహరించిన తీరుకు కారణాలేంటో అర్థం కాకపోవచ్చు.
This post was last modified on April 24, 2022 2:14 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…