కొన్ని కాంబినేషన్ సినిమాల వెనుక చాలా కథ ఉంటుంది. నిజమే ఈ సినిమా కోసమే ఇన్నేళ్ళు ఈ కాంబో కుదరలేదేమో అనిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇలాగే అనిపించిందట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి లెజెండ్ అనిపించుకున్న నాన్నతో నటించాలని ఏ కొడుక్కి ఉండదు. ఇలాంటి కోరికే రామ్ చరణ్ కి కూడా ఎప్పటి నుండో ఉంది. ‘మగధీర’, ‘ఖైది నంబర్ 150’, సినిమాల్లో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఫుల్లెంత్ సినిమా చేయలేకపోయాడు చరణ్. ఆ కోరిక తీర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది.
ఎట్టకేలకు నాన్న తో కలిసి ‘ఆచార్య’ సినిమాలో నటించాడు చరణ్. ముందుగా ఈ క్యారెక్టర్ ని తక్కువ నిడివితో రాసుకున్నాడు కొరటాల. కానీ చరణ్ సీన్ లోకి వచ్చాక ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది. సీన్లు కూడా పెరిగి సినిమాలో ఆ పాత్ర సగ భాగమైంది. అయితే నాన్నతో ఈ సినిమా చెయడం ఒకెత్తయితే, షూటింగ్ లో ఇరవై రోజుల పాటు ఆయన పక్కనే ఉంటూ టైం స్పెండ్ చేయడం మరో ఎత్తు అంటూ, రోజంతా నాన్నతో గడిపిన ఆ మూమెంట్స్ ని ఎప్పుడూ పదిలంగా దాచుకుంటానని చెప్పుకున్నాడు చరణ్.
ఇక ఇదే వేదికగా రాజమౌళి గారితో సినిమా అంటే ఏ ఆర్టిస్ట్ కైనా బయటికి వెళ్లి మరో సినిమా చేసే అవకాశం ఉండదని, బహుశా అది నా ఒక్కడికే కుదిరిందని అన్నాడు చరణ్. దానికి ఉదాహరణగా బొమ్మరిల్లు సినిమా చెప్పాడు. అందులో సిద్దు చేతిని పట్టుకున్న ప్రకాష్ రాజ్ లా రాజమౌళి చేతిలోనే యాక్టర్ చేయి ఉంటుందని కానీ నాన్న కోరిక , అమ్మ కోరిక కాదనలేక ఆయన నా చేయి విడిచి పెట్టారని ఇందుకు మా అమ్మ మీకు థాంక్స్ చెప్పాలనుకుంటుంది అని రాజమౌళి గురించి చెప్పాడు చరణ్.
ఇంత వరకూ రాజమౌళి తన హీరోని ఇలా మరో సినిమా చేసుకొని రమ్మని వదిలింది లేదు. చిరు మాట కాదన లేకే జక్కన్న చరణ్ ని విడిచాడని అందరికీ తెల్సిందే. ఇక రాజమౌళి చరణ్ ని వదిలినప్పుడల్లా షూట్ చేసుకుంటూ వచ్చామని చిరు వేదిక మీదే చెప్పారు. అంటే రాజమౌళి కొన్ని కండీషన్స్ పెట్టి చరణ్ ని వదిలిపెట్టాడని ఈవెంట్ ద్వారా వ్యక్తమైంది.
This post was last modified on April 24, 2022 1:15 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…