Movie News

చిరంజీవి గారి వల్లే ఇండస్ట్రీ బతికింది: నిర్మాత సవాల్

తెలుగు సినిమాకు ఇప్పుడు దాసరి లేని లోటు తీరుస్తున్నది చిరునే అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీలో మరో వర్గం మాత్రం దీన్ని ఒప్పుకోలేకపోతున్నారు. దీని చాలానే కారణాలున్నాయి. చిరు తమని పక్కన పెట్టి ఇండస్ట్రీలో తానే ముందు అన్నట్టుగా సమస్యల చర్చకు వెళ్తున్నారని వారి అభిప్రాయం. అందుకే ఓ వేదికపై తను ఇండస్ట్రీ పెద్ద స్థానంలో లేనని కేవలం తనని సలహా కానీ , సాయం కానీ కోరుకుంటే ముందుంటానని తనకి పెద్ద అనే ట్యాగ్ అక్కర్లేదని చిరు చిన్నగా ఫైర్ అయ్యారు కూడా.

అయితే ఇప్పుడు ‘ఆచార్య’ వేదికగా మళ్ళీ ఈ విషయం చర్చ కొచ్చింది. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఉంటున్న ఎన్ వి ప్రసాద్ చిరు గొప్పదనం చెప్తూ మిగతా వారికీ సవాలు విసరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ బతికింది అంటే దానికి ఏకైక కారణం చిరంజీవి గారే. ఆయన ముందుండి ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని , ఆచార్యగా పెద్ద సినిమాలకు దారి ఇచ్చి డేట్స్ అడ్జస్ట్ చేయడంలో కూడా చిరంజీవి గారు ముఖ్య భూమిక పోషించారని వేదికగా మాట్లాడాడు ఎన్ వి ప్రసాద్.

ఎవరో ఎన్నో మాట్లాడతారు కానీ నా ముందుకొచ్చి మాట్లాడండి ఇది నా సవాల్ ఊరికే సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడటం కాదు అంటూ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో బాలకృష్ణ , మోహన్ బాబు తదితరులు చిరు పెద్దగా ఉంటూ చేస్తున్న పనుల గురించి సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తపరిచారు.

ఇది అందరికీ తెల్సిందే. మరి ఇప్పుడు ఎన్ వి ప్రసాద్ మాటలు చూస్తే వారితో పాటు చిరు గురించి నెగిటివ్ గా మాట్లాడిన అందరికీ చురకలు అంటించినట్టే అనిపిస్తుంది. ఏదేమైనా ఇండస్ట్రీ కి ఓ వ్యక్తి ద్వారా మంచి జరిగితే పెద్ద అనడంలో సందేహం లేదు. అందుకే ప్రస్తుతం రాజమౌళి నుండి ఎన్ వి ప్రసాద్ దాక అందరూ అదే చెప్తూ చిరుకి ఎట్టకేలకు దాసరి స్థానం కట్టబెట్టేశారు.

This post was last modified on April 24, 2022 12:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago