మెగాస్టార్ చిరంజీవికి ఓ రెండు కోరికలు ఉండేవి. ఆ రెండు ఇప్పుడు ఓ వ్యక్తి వల్ల తీరిపోయాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికగా చిరు తన మనసులో మాటలు బయటపెట్టారు. చిరు కోరికలో మొదటిది తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పడం. అప్పట్లో ‘రుద్రవీణ’ అవార్డు అందుకోవడం కోసం ఓ సందర్భంలో డిల్లీ వెళ్ళిన చిరు సౌత్ సినిమాని అక్కడ ఎంత చిన్న చూపు చూశారో చెప్పుకున్నారు.
తెలుగు సినిమాకి సంబంధించి ఒక్క సినిమా పోస్టర్ కూడా పెట్టలేదని అది తనని ఎంతో భాదించిందని అన్నారు. అక్కడి నుండి నేరుగా చెన్నై వచ్చి మీడియాతో ఈ విషయం చెప్పి వాపోయానని, ఓ పత్రిక తన భావాన్ని బాగా ప్రచురించారని కానీ ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు.
ఇన్నాళ్ళకి తెలుగు సినిమా , సౌత్ సినిమా అనే బేరియర్ ని చెరిపేసి ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి రాజమౌళి నిజంగా తనను గర్వపడేలా చేశాడని, ఇప్పుడు RRR, పుష్ప , KGF గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే తనకి ఏంటో సంతోషంగానూ, గర్వగంగానూ ఉందని తెలిపారు చిరు.
ఈ రకంగా తన కోరిక నెరవేరిందని సభా పూర్వకంగా వెల్లడించాడు మెగా స్టార్. ఇక చిరు మరో కోరిక చరణ్ తో కలిసి ఓ ఫుల్లెంత్ సినిమా చేయడం , అది ‘ఆచార్య’తో అనుకోకుండా నెరవేరిందని చెప్పుకున్నారు. దీనికి రాజమౌళి నే కారణమని ఆయన చరణ్ ని విడిచి ఈ సినిమా చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ కోరిక తీరేది కాదని అన్నారు. ఇక ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలనేది తన భార్య కోరిక కూడా అంటూ ఇప్పటికే ఓ సారి చెప్పుకున్న చిరు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలా మెగాస్టార్ మెగా కోరికలు తీరడానికి కారకుడయిన రాజమౌళిని సన్మానించి థాంక్స్ చెప్పుకున్నారు చిరు.
This post was last modified on April 24, 2022 11:51 am
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…
ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…
రాజకీయంగా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజకీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్కడ…
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చేసిన రెండు సినిమాలతోనే చాలా ప్రామిసింగ్గా అనిపించిన వారసుల్లో ధ్రువ్ విక్రమ్ ఒకడు. అర్జున్…
సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తీసే సినిమాలో.. ఓ పెద్ద హీరో నటించినపుడు చిన్న సన్నివేశమైనా సరే సుక్కునే తీయాల్సి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…