మెగాస్టార్ చిరంజీవికి ఓ రెండు కోరికలు ఉండేవి. ఆ రెండు ఇప్పుడు ఓ వ్యక్తి వల్ల తీరిపోయాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికగా చిరు తన మనసులో మాటలు బయటపెట్టారు. చిరు కోరికలో మొదటిది తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పడం. అప్పట్లో ‘రుద్రవీణ’ అవార్డు అందుకోవడం కోసం ఓ సందర్భంలో డిల్లీ వెళ్ళిన చిరు సౌత్ సినిమాని అక్కడ ఎంత చిన్న చూపు చూశారో చెప్పుకున్నారు.
తెలుగు సినిమాకి సంబంధించి ఒక్క సినిమా పోస్టర్ కూడా పెట్టలేదని అది తనని ఎంతో భాదించిందని అన్నారు. అక్కడి నుండి నేరుగా చెన్నై వచ్చి మీడియాతో ఈ విషయం చెప్పి వాపోయానని, ఓ పత్రిక తన భావాన్ని బాగా ప్రచురించారని కానీ ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు.
ఇన్నాళ్ళకి తెలుగు సినిమా , సౌత్ సినిమా అనే బేరియర్ ని చెరిపేసి ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి రాజమౌళి నిజంగా తనను గర్వపడేలా చేశాడని, ఇప్పుడు RRR, పుష్ప , KGF గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే తనకి ఏంటో సంతోషంగానూ, గర్వగంగానూ ఉందని తెలిపారు చిరు.
ఈ రకంగా తన కోరిక నెరవేరిందని సభా పూర్వకంగా వెల్లడించాడు మెగా స్టార్. ఇక చిరు మరో కోరిక చరణ్ తో కలిసి ఓ ఫుల్లెంత్ సినిమా చేయడం , అది ‘ఆచార్య’తో అనుకోకుండా నెరవేరిందని చెప్పుకున్నారు. దీనికి రాజమౌళి నే కారణమని ఆయన చరణ్ ని విడిచి ఈ సినిమా చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ కోరిక తీరేది కాదని అన్నారు. ఇక ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలనేది తన భార్య కోరిక కూడా అంటూ ఇప్పటికే ఓ సారి చెప్పుకున్న చిరు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలా మెగాస్టార్ మెగా కోరికలు తీరడానికి కారకుడయిన రాజమౌళిని సన్మానించి థాంక్స్ చెప్పుకున్నారు చిరు.
This post was last modified on April 24, 2022 11:51 am
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…