మెగాస్టార్ చిరంజీవికి ఓ రెండు కోరికలు ఉండేవి. ఆ రెండు ఇప్పుడు ఓ వ్యక్తి వల్ల తీరిపోయాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికగా చిరు తన మనసులో మాటలు బయటపెట్టారు. చిరు కోరికలో మొదటిది తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పడం. అప్పట్లో ‘రుద్రవీణ’ అవార్డు అందుకోవడం కోసం ఓ సందర్భంలో డిల్లీ వెళ్ళిన చిరు సౌత్ సినిమాని అక్కడ ఎంత చిన్న చూపు చూశారో చెప్పుకున్నారు.
తెలుగు సినిమాకి సంబంధించి ఒక్క సినిమా పోస్టర్ కూడా పెట్టలేదని అది తనని ఎంతో భాదించిందని అన్నారు. అక్కడి నుండి నేరుగా చెన్నై వచ్చి మీడియాతో ఈ విషయం చెప్పి వాపోయానని, ఓ పత్రిక తన భావాన్ని బాగా ప్రచురించారని కానీ ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు.
ఇన్నాళ్ళకి తెలుగు సినిమా , సౌత్ సినిమా అనే బేరియర్ ని చెరిపేసి ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి రాజమౌళి నిజంగా తనను గర్వపడేలా చేశాడని, ఇప్పుడు RRR, పుష్ప , KGF గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే తనకి ఏంటో సంతోషంగానూ, గర్వగంగానూ ఉందని తెలిపారు చిరు.
ఈ రకంగా తన కోరిక నెరవేరిందని సభా పూర్వకంగా వెల్లడించాడు మెగా స్టార్. ఇక చిరు మరో కోరిక చరణ్ తో కలిసి ఓ ఫుల్లెంత్ సినిమా చేయడం , అది ‘ఆచార్య’తో అనుకోకుండా నెరవేరిందని చెప్పుకున్నారు. దీనికి రాజమౌళి నే కారణమని ఆయన చరణ్ ని విడిచి ఈ సినిమా చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ కోరిక తీరేది కాదని అన్నారు. ఇక ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలనేది తన భార్య కోరిక కూడా అంటూ ఇప్పటికే ఓ సారి చెప్పుకున్న చిరు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలా మెగాస్టార్ మెగా కోరికలు తీరడానికి కారకుడయిన రాజమౌళిని సన్మానించి థాంక్స్ చెప్పుకున్నారు చిరు.
This post was last modified on April 24, 2022 11:51 am
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూణ్నాలుగు రోజులుగా నడుస్తున్న సస్పెన్సుకు తెరపడింది. ఎట్టకేలకు గవర్నర్ విజయ్కి అవకాశమిచ్చాడు. సొంతంగా…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన…
తెలంగాణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. గతంలో ఆయన పార్లమెంటులో…
తమిళనాడు రాజకీయాల్లో యువ నాయకత్వానికి కొత్త గుర్తింపుగా నిలిచిన టీవీకే నేత ఎస్. కీర్తన సంపత్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ కు ముందు…
హీరోగా అవకాశాలు ఆగిపోయిన టైంలో ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు సీనియర్ నటుడు జగపతిబాబు. దీంతో ఓవర్ నైట్…