మెగాస్టార్ చిరంజీవికి ఓ రెండు కోరికలు ఉండేవి. ఆ రెండు ఇప్పుడు ఓ వ్యక్తి వల్ల తీరిపోయాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ వేదికగా చిరు తన మనసులో మాటలు బయటపెట్టారు. చిరు కోరికలో మొదటిది తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటి చెప్పడం. అప్పట్లో ‘రుద్రవీణ’ అవార్డు అందుకోవడం కోసం ఓ సందర్భంలో డిల్లీ వెళ్ళిన చిరు సౌత్ సినిమాని అక్కడ ఎంత చిన్న చూపు చూశారో చెప్పుకున్నారు.
తెలుగు సినిమాకి సంబంధించి ఒక్క సినిమా పోస్టర్ కూడా పెట్టలేదని అది తనని ఎంతో భాదించిందని అన్నారు. అక్కడి నుండి నేరుగా చెన్నై వచ్చి మీడియాతో ఈ విషయం చెప్పి వాపోయానని, ఓ పత్రిక తన భావాన్ని బాగా ప్రచురించారని కానీ ఎలాంటి ఫలితం రాలేదని చెప్పారు.
ఇన్నాళ్ళకి తెలుగు సినిమా , సౌత్ సినిమా అనే బేరియర్ ని చెరిపేసి ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమాను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి రాజమౌళి నిజంగా తనను గర్వపడేలా చేశాడని, ఇప్పుడు RRR, పుష్ప , KGF గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే తనకి ఏంటో సంతోషంగానూ, గర్వగంగానూ ఉందని తెలిపారు చిరు.
ఈ రకంగా తన కోరిక నెరవేరిందని సభా పూర్వకంగా వెల్లడించాడు మెగా స్టార్. ఇక చిరు మరో కోరిక చరణ్ తో కలిసి ఓ ఫుల్లెంత్ సినిమా చేయడం , అది ‘ఆచార్య’తో అనుకోకుండా నెరవేరిందని చెప్పుకున్నారు. దీనికి రాజమౌళి నే కారణమని ఆయన చరణ్ ని విడిచి ఈ సినిమా చేయమని గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఆ కోరిక తీరేది కాదని అన్నారు. ఇక ఇద్దరం కలిసి ఓ సినిమా చేయాలనేది తన భార్య కోరిక కూడా అంటూ ఇప్పటికే ఓ సారి చెప్పుకున్న చిరు మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇలా మెగాస్టార్ మెగా కోరికలు తీరడానికి కారకుడయిన రాజమౌళిని సన్మానించి థాంక్స్ చెప్పుకున్నారు చిరు.
This post was last modified on April 24, 2022 11:51 am
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…