తెలుగులో క్లాసిక్గా పేరు తెచ్చుకున్న నాని జెర్సీ మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, నాగవంశీ కలిసి అమన్ గిల్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. కరోనా, ఇతర కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ముందే సెలబ్రెటీలకు ప్రిమియర్ వేశారు. అక్కడ మంచి టాక్ వచ్చింది. ఈ రోజు సమీక్షకులు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టాక్కు తగ్గట్లుగా కలెక్షన్లు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్లోనే జెర్సీ అంచనాలను అందుకోలేదు. తొలి రోజు కలెక్షన్లు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.
తొలి రోజు ఇండియాలో జెర్సీ రూ.4 కోట్లకు మించి నెట్ వసూళ్లు సాధించే పరిస్థితి లేదన్నది ట్రేడ్ పండిట్ల మాట. వారం ముందు రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2కేమో శుక్రవారం రూ.12 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే ఒక బాలీవుడ్ స్టార్ నటించిన కొత్త హిందీ మూవీ కంటే.. పాత డబ్బింగ్ మూవీకి మూడు రెట్లు వసూళ్లు ఎక్కువ అన్నమాట.
దీన్ని బట్టి హిందీ ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లకు ఇప్పుడు మంచి మాస్, యాక్షన్ సినిమాలు కావాలి. అవి సౌత్ ఇండస్ట్రీనే అందిస్తోంది. బాలీవుడ్లో వచ్చే క్లాస్ సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అక్కడి ప్రేక్షకులు. ఈ క్రమంలోనే జెర్సీకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తొలి రోజు ఆ ప్రభావం వసూళ్ల మీద బాగానే పడింది. మరి పాజిటివ్ టాక్ను సద్వినియోగం చేసుకుని సినిమా వీకెండ్లో పుంజుకుంటుందేమో చూడాలి.
This post was last modified on April 23, 2022 6:33 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…