తెలుగులో క్లాసిక్గా పేరు తెచ్చుకున్న నాని జెర్సీ మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ను రూపొందించిన గౌతమ్ తిన్ననూరినే హిందీలోనూ డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, నాగవంశీ కలిసి అమన్ గిల్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. కరోనా, ఇతర కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ముందే సెలబ్రెటీలకు ప్రిమియర్ వేశారు. అక్కడ మంచి టాక్ వచ్చింది. ఈ రోజు సమీక్షకులు, ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. కానీ ఈ టాక్కు తగ్గట్లుగా కలెక్షన్లు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్లోనే జెర్సీ అంచనాలను అందుకోలేదు. తొలి రోజు కలెక్షన్లు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు.
తొలి రోజు ఇండియాలో జెర్సీ రూ.4 కోట్లకు మించి నెట్ వసూళ్లు సాధించే పరిస్థితి లేదన్నది ట్రేడ్ పండిట్ల మాట. వారం ముందు రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2కేమో శుక్రవారం రూ.12 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే ఒక బాలీవుడ్ స్టార్ నటించిన కొత్త హిందీ మూవీ కంటే.. పాత డబ్బింగ్ మూవీకి మూడు రెట్లు వసూళ్లు ఎక్కువ అన్నమాట.
దీన్ని బట్టి హిందీ ప్రేక్షకుల అభిరుచి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లకు ఇప్పుడు మంచి మాస్, యాక్షన్ సినిమాలు కావాలి. అవి సౌత్ ఇండస్ట్రీనే అందిస్తోంది. బాలీవుడ్లో వచ్చే క్లాస్ సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అక్కడి ప్రేక్షకులు. ఈ క్రమంలోనే జెర్సీకి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తొలి రోజు ఆ ప్రభావం వసూళ్ల మీద బాగానే పడింది. మరి పాజిటివ్ టాక్ను సద్వినియోగం చేసుకుని సినిమా వీకెండ్లో పుంజుకుంటుందేమో చూడాలి.
This post was last modified on April 23, 2022 6:33 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…