మన వాళ్లకు విఘ్నేష్ శివన్ అంటే నయనతార బాయ్ ఫ్రెండ్గానే తెలుసు. తమిళంలో దర్శకుడిగా అతడికి మంచి పేరే ఉంది. శింబు-వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించిన పోడా పోడి అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విజయ్ సేతుపతి-నయనతార కలయికలో తెరకెక్కించిన నానుమ్ రౌడీదా సినిమాతో బ్లాక్బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం నేనూ రౌడీనే పేరుతో తెలుగులో కూడా అనువాదమైంది.
ఆ తర్వాత అతను సూర్య హీరోగా గ్యాంగ్ సినిమా తీశాడు. ఇది ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత అతను తెరకెక్కించిన చిత్రమే.. కాదువాతుల రెండు కాదల్. షార్ట్గా కేఆర్కే అని పిలుస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖటీజాగా అనువదిస్తున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం భలే ఎంటర్టైనింగ్గా సాగింది.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో రొమాన్స్ చేసి.. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిశాక కూడా ఇద్దరితోనూ కలిసి ఉండాలని కోరుకునే కుర్రాడి కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఫన్నీగా డీల్ చేసినట్లున్నాడు విఘ్నేష్. ఖుషి సినిమాలో ఆరిపోతున్న దీపానికి చేతులు అడ్డు పెట్టే క్రమంలో హీరో హీరోయిన్లు తొలిసారి కలుసుకునే సన్నివేశం ఎంత పాపులరో తెలిసిందే.
ఇందులో దాన్ని పేరడీ చేశారు. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు వచ్చి దీపాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఫన్నీ షాట్లు ట్రైలర్లో చాలానే ఉన్నాయి. లీడ్ ఆర్టిస్టులు ముగ్గురూ మంచి పెర్ఫామర్లు కావడం, విఘ్నేష్ శివన్ మార్కు రొమాన్స్, కామెడీ బాగా వర్కవుట్ కావడంతో సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో ఆకర్షణ.
This post was last modified on April 23, 2022 6:28 am
టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లకు.. పరోక్షంగా ఓ విషయాన్ని తేల్చి చెప్పేశారు. కూటమి విషయంలోనూ.. ముఖ్యంగా జనసేన-టీడీపీ…
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…