మన వాళ్లకు విఘ్నేష్ శివన్ అంటే నయనతార బాయ్ ఫ్రెండ్గానే తెలుసు. తమిళంలో దర్శకుడిగా అతడికి మంచి పేరే ఉంది. శింబు-వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించిన పోడా పోడి అనే హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విజయ్ సేతుపతి-నయనతార కలయికలో తెరకెక్కించిన నానుమ్ రౌడీదా సినిమాతో బ్లాక్బస్టర్ కొట్టాడు. ఈ చిత్రం నేనూ రౌడీనే పేరుతో తెలుగులో కూడా అనువాదమైంది.
ఆ తర్వాత అతను సూర్య హీరోగా గ్యాంగ్ సినిమా తీశాడు. ఇది ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత అతను తెరకెక్కించిన చిత్రమే.. కాదువాతుల రెండు కాదల్. షార్ట్గా కేఆర్కే అని పిలుస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖటీజాగా అనువదిస్తున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. అది ఆద్యంతం భలే ఎంటర్టైనింగ్గా సాగింది.
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయితో రొమాన్స్ చేసి.. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలిశాక కూడా ఇద్దరితోనూ కలిసి ఉండాలని కోరుకునే కుర్రాడి కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఫన్నీగా డీల్ చేసినట్లున్నాడు విఘ్నేష్. ఖుషి సినిమాలో ఆరిపోతున్న దీపానికి చేతులు అడ్డు పెట్టే క్రమంలో హీరో హీరోయిన్లు తొలిసారి కలుసుకునే సన్నివేశం ఎంత పాపులరో తెలిసిందే.
ఇందులో దాన్ని పేరడీ చేశారు. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్లు వచ్చి దీపాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఫన్నీ షాట్లు ట్రైలర్లో చాలానే ఉన్నాయి. లీడ్ ఆర్టిస్టులు ముగ్గురూ మంచి పెర్ఫామర్లు కావడం, విఘ్నేష్ శివన్ మార్కు రొమాన్స్, కామెడీ బాగా వర్కవుట్ కావడంతో సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో ఆకర్షణ.
This post was last modified on April 23, 2022 6:28 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…