కరోనా క్రైసిస్ వల్ల నాని ప్లానింగ్ కాస్త దెబ్బ తింది. పక్కా ప్రణాళికతో ఏది చేసినా రిలీజ్ డేట్ తో సహా ముందు ప్లాన్ చేసుకునే నాని ‘వి’ సినిమానే ఇంకా విడుదల కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన ఆ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. టక్ జగదీష్ షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కనుక ముందుగా అది పూర్తి చేస్తాడు.
ఆ తర్వాత నాని వేసుకున్న ఆర్డర్ లో శ్యామ్ సింగ రాయ్ చేయాలి. అది కాస్త ఎక్కువ బడ్జెట్ సినిమా కనుక వాయిదా వేస్తారనే రూమర్స్ వినిపించాయి. కానీ నాని ఆర్డర్ మిస్ అవడం లేదు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్నే టక్ జగదీష్ తర్వాత చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నారు.
ఇప్పటికే ఒక కథానాయికగా సాయి పల్లవి ఓకే కాగా, మరో పాత్రకు రష్మిక పేరు పరిశీలనలో ఉంది. టక్ జగదీష్ షూట్ పూర్తి కాగానే ఈ చిత్రాన్ని మొదలు పెట్టి వచ్చే వేసవిలో విడుదల చేసేలా నిర్మాత నాగవంశీ ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. నాని వేరే కథలు విన్నా కానీ అవి ఈ చిత్రం పూర్తయిన తర్వాతే ఉంటాయన్నమాట. మరి ఈ చిత్రం బడ్జెట్ పరంగా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయో లేదో ఇంకా తెలియదు.
This post was last modified on June 22, 2020 10:28 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…