కీర్తి సురేష్ కెరీర్ను ‘మహానటి’కి ముందు, ‘మహానటి’కి తర్వాత అని విభజించి చూడాలి. ఆ సినిమా ముందు వరకు ఆమెను మంచి నటిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ‘మహానటి’తో ఒక్కసారిగా అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఈమెలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించింది. ఆ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుందామె. ఐతే ‘మహానటి’ తర్వాత తనపై భారీగా పెరిగిన అంచనాలను కీర్తి అందుకోలేకపోయింది.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే తమిళంలో ఆమె నటిస్తున్న ‘సాని కాయిదం’ సినిమా మాత్రం కీర్తి ఈజ్ బ్యాక్ అనిపిస్తుందనే అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ షాకైపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ కాబోతున్న ‘సాని కాయిదం’ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
ఇదొక రివెంజ్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి అని చెబుతూ రాయితో కొడితే తిరిగి రాయితో కొడతాం.. మన మీద ఉమ్మేస్తే తిరిగి ఉమ్మేస్తాం.. కానీ ఒకడు మన వాళ్లను చంపి మన జీవితాల్ని నాశనం చేశాక అతను జైలుకు వెళ్తే ప్రతీకారం తీరినట్లు ఎలా అవుతుంది అంటూ.. కీర్తి ప్రశ్నించడం.. తర్వాత కీర్తి ఓ వ్యక్తిని నిలువునా తగలబెడుతుండటం కనిపించింది.
ఈ ప్రతీకారంలో సెల్వ రాఘవన్కు కూడా భాగం ఉన్నట్లు చూపించారు. ఐతే కీర్తికి, సెల్వకు ఉన్న సంబంధమేంటన్నది తెర మీదే చూడాలి. టీజర్ అయితే బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి కీర్తి గత చిత్రాలకు భిన్నమైన రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుందేమో చూడాలి. మే 6న తమిళంతో పాటు మరి కొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘రాకీ’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on April 22, 2022 1:31 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…