కీర్తి సురేష్ కెరీర్ను ‘మహానటి’కి ముందు, ‘మహానటి’కి తర్వాత అని విభజించి చూడాలి. ఆ సినిమా ముందు వరకు ఆమెను మంచి నటిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ‘మహానటి’తో ఒక్కసారిగా అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఈమెలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించింది. ఆ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుందామె. ఐతే ‘మహానటి’ తర్వాత తనపై భారీగా పెరిగిన అంచనాలను కీర్తి అందుకోలేకపోయింది.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే తమిళంలో ఆమె నటిస్తున్న ‘సాని కాయిదం’ సినిమా మాత్రం కీర్తి ఈజ్ బ్యాక్ అనిపిస్తుందనే అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ షాకైపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ కాబోతున్న ‘సాని కాయిదం’ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
ఇదొక రివెంజ్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి అని చెబుతూ రాయితో కొడితే తిరిగి రాయితో కొడతాం.. మన మీద ఉమ్మేస్తే తిరిగి ఉమ్మేస్తాం.. కానీ ఒకడు మన వాళ్లను చంపి మన జీవితాల్ని నాశనం చేశాక అతను జైలుకు వెళ్తే ప్రతీకారం తీరినట్లు ఎలా అవుతుంది అంటూ.. కీర్తి ప్రశ్నించడం.. తర్వాత కీర్తి ఓ వ్యక్తిని నిలువునా తగలబెడుతుండటం కనిపించింది.
ఈ ప్రతీకారంలో సెల్వ రాఘవన్కు కూడా భాగం ఉన్నట్లు చూపించారు. ఐతే కీర్తికి, సెల్వకు ఉన్న సంబంధమేంటన్నది తెర మీదే చూడాలి. టీజర్ అయితే బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి కీర్తి గత చిత్రాలకు భిన్నమైన రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుందేమో చూడాలి. మే 6న తమిళంతో పాటు మరి కొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘రాకీ’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…