కీర్తి సురేష్ కెరీర్ను ‘మహానటి’కి ముందు, ‘మహానటి’కి తర్వాత అని విభజించి చూడాలి. ఆ సినిమా ముందు వరకు ఆమెను మంచి నటిగా ఎవరూ గుర్తించలేదు. కానీ ‘మహానటి’తో ఒక్కసారిగా అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఈమెలో ఇంత గొప్ప నటి ఉందా అనిపించింది. ఆ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుందామె. ఐతే ‘మహానటి’ తర్వాత తనపై భారీగా పెరిగిన అంచనాలను కీర్తి అందుకోలేకపోయింది.
పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తోడు కీర్తి నటించిన వేరే చిత్రాల్లో కూడా తన పాత్రలు క్లిక్ కాలేదు. వరుసగా ఆమెకు పరాజయాలు తప్పలేదు. ఐతే తమిళంలో ఆమె నటిస్తున్న ‘సాని కాయిదం’ సినిమా మాత్రం కీర్తి ఈజ్ బ్యాక్ అనిపిస్తుందనే అంచనాలు రేకెత్తించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూసినపుడే అందరూ షాకైపోయారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో.. వీళ్లిద్దరూ హత్యలు చేసే కిల్లర్లుగా కనిపించడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి అమేజాన్ ప్రైమ్లో నేరుగా రిలీజ్ కాబోతున్న ‘సాని కాయిదం’ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.
ఇదొక రివెంజ్ డ్రామా అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి అని చెబుతూ రాయితో కొడితే తిరిగి రాయితో కొడతాం.. మన మీద ఉమ్మేస్తే తిరిగి ఉమ్మేస్తాం.. కానీ ఒకడు మన వాళ్లను చంపి మన జీవితాల్ని నాశనం చేశాక అతను జైలుకు వెళ్తే ప్రతీకారం తీరినట్లు ఎలా అవుతుంది అంటూ.. కీర్తి ప్రశ్నించడం.. తర్వాత కీర్తి ఓ వ్యక్తిని నిలువునా తగలబెడుతుండటం కనిపించింది.
ఈ ప్రతీకారంలో సెల్వ రాఘవన్కు కూడా భాగం ఉన్నట్లు చూపించారు. ఐతే కీర్తికి, సెల్వకు ఉన్న సంబంధమేంటన్నది తెర మీదే చూడాలి. టీజర్ అయితే బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి కీర్తి గత చిత్రాలకు భిన్నమైన రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుందేమో చూడాలి. మే 6న తమిళంతో పాటు మరి కొన్ని భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘రాకీ’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే ఆకట్టుకున్న అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
This post was last modified on April 22, 2022 1:31 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…