మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో తన రెండో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారు. ‘కత్తి’ రీమేక్ ‘ఖైదీ నంబర్ 150’తో పునరాగమనం చేసిన ఆయన మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్లోనూ నటించబోతున్నట్లు సంగతి తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కొన్ని నెలలుగా ఆ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు సుజీత్.
ఉన్నదున్నట్లు దించేయకుండా తెలుగు నేటివిటీకి, చిరు ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడతను. ఈ సినిమాలో హీరో తర్వాత అంత కీలకమైంది ఒక లేడీ క్యారెక్టర్. హీరోతో రక్త సంబంధం ఉండదు కానీ.. వరుసకు సోదరి అయ్యే పాత్ర అది. ఒరిజినల్లో మోహన్ లాల్ హీరో పాత్ర చేయగా.. ఆ లేడీ క్యారెక్టర్లో మంజు వారియర్ నటించింది. తెలుగులో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈ మిడిలేజ్డ్ లేడీ క్యారెక్టర్లో పేరున్న నటి కనిపిస్తేనే బాగుంటుంది. ఆ పాత్రకు ఇంతకుముందు విజయశాంతి పేరు వినిపించింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుంది. చిరు పక్కన కథానాయికగా డబుల్ డిజిట్ సినిమాలు చేసి, ఆయనతో పోటాపోటీగా నటించిన విజయశాంతి ఇప్పుడు ఆయనకు సోదరిగా నటిస్తే బాగుంటుందా అన్న ప్రశ్న తలెత్తింది. విజయశాంతి విషయంలో తర్వాత ఏ అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఇప్పుడు ఈ పాత్రకు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు.. సుహాసిని కావడం విశేషం. ఈమె కూడా చిరుకు కథానాయికగా అనేక సినిమాల్లో నటించింది. ఐతే విజయశాంతితో పోలిస్తే సుహాసిని ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను సంప్రదించారని.. ఓకే అందని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు. చిరు తనయుడు రామ్ చరణే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
This post was last modified on June 22, 2020 3:55 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…