మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో తన రెండో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారు. ‘కత్తి’ రీమేక్ ‘ఖైదీ నంబర్ 150’తో పునరాగమనం చేసిన ఆయన మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్లోనూ నటించబోతున్నట్లు సంగతి తెలిసిందే. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కొన్ని నెలలుగా ఆ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడు సుజీత్.
ఉన్నదున్నట్లు దించేయకుండా తెలుగు నేటివిటీకి, చిరు ఇమేజ్కు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడతను. ఈ సినిమాలో హీరో తర్వాత అంత కీలకమైంది ఒక లేడీ క్యారెక్టర్. హీరోతో రక్త సంబంధం ఉండదు కానీ.. వరుసకు సోదరి అయ్యే పాత్ర అది. ఒరిజినల్లో మోహన్ లాల్ హీరో పాత్ర చేయగా.. ఆ లేడీ క్యారెక్టర్లో మంజు వారియర్ నటించింది. తెలుగులో ఈ పాత్రను ఎవరు చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఈ మిడిలేజ్డ్ లేడీ క్యారెక్టర్లో పేరున్న నటి కనిపిస్తేనే బాగుంటుంది. ఆ పాత్రకు ఇంతకుముందు విజయశాంతి పేరు వినిపించింది. ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత మళ్లీ బ్రేక్ తీసుకుంది. చిరు పక్కన కథానాయికగా డబుల్ డిజిట్ సినిమాలు చేసి, ఆయనతో పోటాపోటీగా నటించిన విజయశాంతి ఇప్పుడు ఆయనకు సోదరిగా నటిస్తే బాగుంటుందా అన్న ప్రశ్న తలెత్తింది. విజయశాంతి విషయంలో తర్వాత ఏ అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఇప్పుడు ఈ పాత్రకు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరు.. సుహాసిని కావడం విశేషం. ఈమె కూడా చిరుకు కథానాయికగా అనేక సినిమాల్లో నటించింది. ఐతే విజయశాంతితో పోలిస్తే సుహాసిని ఈ పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమెను సంప్రదించారని.. ఓకే అందని అంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రావచ్చని అంటున్నారు. చిరు తనయుడు రామ్ చరణే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…