థియేటర్లు తెరిచే వరకు వేచి చూద్దామా.. లేక ఎంత వస్తే అంత వచ్చింది అని ఏదైనా ఓటీటీ ఫ్లాట్ఫామ్తో డీల్ కుదుర్చుకుని సినిమాను ఆన్ లైన్లో రిలీజ్ చేసేద్దామా.. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయోమయం.
సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేయడమే మంచిదన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చినా పెద్దగా రెవెన్యూ రాకపోవచ్చనుకునే, థియేటర్లు పెద్దగా దొరికే అవకాశం లేదు అనుకునే సినిమాలను ఇలాగే ధైర్యం చేసి ఓటీటీల్లో వదిలేస్తున్నారు.
ఈ విషయంలో మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ కొంచెం వెనుకంజలోనే ఉంది. ఇప్పటిదాకా ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా మాత్రమే ఓటీటీలో రిలీజైంది. సత్యదేవ్ సినిమాలు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘47 డేస్’ ఓటీటీ రిలీజ్కు లైన్లో ఉన్నాయి.
ఈ వరుసలో చేరే సినిమాలేవా అని చూస్తున్నారంతా. సురేష్ ప్రొడక్షన్స్ వారి ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఇలాగే రిలీజ్ కాబోతోందని ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయం ఖరారైంది. తాజాగా ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన శ్రద్ధ శ్రీనాథ్ తమ చిత్రం ఓటీటీలోనే రిలీజ్ కాబోతోందని సంకేతాలిచ్చింది. ‘కమింగ్ టు యువర్ డివైజెస్ సూన్’ అంటూ ఆమె ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేసింది. దీన్ని బట్టి సినిమాను టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లలో చూసుకోవచ్చన్నమాట.
‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ను ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేశఆడు. శ్రద్ధతో పాటు షాలిని వడ్నికట్టి అనే అమ్మాయి ఇందులో మరో కథానాయికగా నటించింది. సిద్ధు, రవికాంత్ కలిసి ఈ చిత్రానికి స్క్రిప్టు రాయడం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది. అంతా బాగుంటే మే 1న రిలీజవ్వాల్సిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.
This post was last modified on June 22, 2020 10:13 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…