కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ఎలా ప్రభంజనం సృష్టిస్తున్నాయో తెలిసిందే. కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన.. ఏవో కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూళ్లు రాబట్టేస్తున్నాయని.. ప్రతి ఒక్కరూ తమ చిత్రాలను కూడా బహు భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏ తరహా సినిమాలకు ఇలా దేశవ్యాప్తంగా ఆదరణ ఉంటోంది.. ఎలా ప్రమోట్ చేస్తే ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.. అన్నది చూడటం లేదు కొందరు హీరోలు. కేవలం ఒక భాషలో సినిమా తీస్తున్నారు. వేరే భాషల్లో అనువాదం చేసి వదిలేస్తున్నారు. సరైన ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజవుతున్న ఆ చిత్రాలు విడుదల ఖర్చులు కూడా వెనక్కి తేవడం లేదు.
నేచురల్ స్టార్ నాని విషయానికి వస్తే.. అతడి గత సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ని తమిళం, మలయాళంలోనూ రిలీజ్ చేశారు. కానీ ఆ చిత్రం కనీస ప్రభావం కూడా చూపలేదు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ని కూడా ఆ రెండు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు తాజాగా ప్రకటన వచ్చింది.
సరిగ్గా రిలీజ్ ముంగిట ఇలా వేరే భాషల్లో రిలీజ్ అంటే ప్రయోజనం ఉండదు. ముందు నుంచి ఒక పద్ధతి ప్రకారం సినిమాను ఆయా భాషల్లో ప్రమోట్ చేయాలి. వివిధ భాషల ప్రేక్షకులను ఆకర్షించే క్రేజీ కంటెంట్ రెడీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో మాస్, యాక్షన్ అంశాలు కీలకం. కానీ ‘అంటే సుందరానికీ’ సినిమా వేరే భాషల వాళ్లను ఆకర్షించే సూచనలు ఇప్పటికైతే ఏమీ కనిపంచడం లేదు.
మరోవైపు తెలుగులోనే సరైన హిట్లు లేక సతమతం అవుతున్న నిఖిల్ సిద్దార్థ సైతం పాన్ ఇండియా ఇమేజ్ కోసం తపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అతడి కొత్త చిత్రం ‘స్పై’ని పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూసి నెటిజన్లు కామెడీ చేస్తున్నారు. నిజానికి నాని సైతం ఈ మధ్య సరైన ఫాంలో లేడు. ముందు తెలుగులో నిలదొక్కుకోకుండా, ఒక స్థాయి అందుకోకుండా ఎందుకొచ్చిన పాన్ ఇండియా ప్రయాస అంటూ ఈ యంగ్ హీరోల మీద కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on April 17, 2022 3:19 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…