Movie News

నెగెటివిటీ చూసి చిరు భయపడ్డాడా?

మెగాస్టార్ చిరంజీవి తన తాజా నిర్ణయంపై తన అభిమానుల నుంచే వస్తున్న నెగెటివిటీ చూసి భయపడ్డారా? ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. చిరు కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించబోతున్నారని.. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరగడం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం దీని గురించి వార్తలు రావడం తెలిసిందే. ఐతే ఈ సమాచారం బయటికి రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో చిరు మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యంగా మెగా అభిమానులే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాడుతుంటే.. ఇంకోవైపు జగన్‌ను తన సినిమా వేడుకకు చిరు ముఖ్య అతిథిగా పిలిచి ఆయనతో సన్నిహితంగా మెలిగితే.. పొగడ్తలు గుప్పిస్తే ఏమైనా బాగుంటుందా అంటూ అందరూ చిరును తప్పుబట్టారు.

రాజకీయంగా ఏపీలో వేడి రాజుకుంటున్న సమయంలో, ప్రభుత్వంపై పవన్ ఎటాక్ మరో స్థాయికి చేరుతున్న తరుణంలో ఈ కలయికి ఎంతమాత్రం మంచిది కాదని.. పవన్‌కు బాగా డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. న్యూట్రల్స్ సంగతి పక్కన పెడితే మెగా అభిమానులే ఈ ఆలోచనను తప్పుబట్టడంతో చిరు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లోనే చేయబోతున్నారట. ఆంధ్రాలో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారట కానీ.. జగన్ ముఖ్య అతిథిగా ప్రి రిలీజ్ ఈవెంట్ మాత్రం లేదనే అంటున్నారు. ‘ఆచార్య’ టీం అయితే అసలు ముందు నుంచి ఈ ఆలోచన లేదన్నట్లుగా మాట్లాడుతోందట.

ఈ ఈవెంట్‌కు అసలు ఏర్పాట్లే జరగలేదని.. జనాల స్పందన ఎలా ఉంటుందో చూడటానికి పీలర్ వదిలారని.. రెస్పాన్స్ చూశాక వెనక్కి తగ్గారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జగన్ పాల్గొనడం లేదు అన్న సమాచారం మాత్రం మెగా అభిమానులకు గొప్ప ఊరటనిస్తోంది.

This post was last modified on April 17, 2022 3:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సందీప్ వంగాకు ఒకలా భన్సాలీకి మరోలా

యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…

23 mins ago

విదేశీ పర్యటన: జగన్, చంద్రబాబు.. ఇద్దరి మధ్యా తేడా ఇదీ.!

ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్‌కి ముందు.. కొంత ఉపశమనం…

24 mins ago

జనసేనలోకి వంగా గీత.!? అసలేం జరుగుతోంది.?

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…

25 mins ago

కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా..…

41 mins ago

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

2 hours ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

3 hours ago