కేజీఎఫ్-2 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలివేషన్ల విషయంలో, భారీతనంలో, విజువల్ ఎక్స్పీరియన్స్ పరంగా ఈ సినిమా ‘కేజీఎఫ్-1’ కంటే కొన్ని మెట్లు పైనే ఉందని చెప్పాలి. వాటి వరకు ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కానీ అందరు ప్రేక్షకులూ ఇలా ఉండరు. కేవలం ఎలివేషన్లు చూసి ఆహా ఓహో అనేయరు.
ఆ ఎలివేషన్లకు ముందు బలమైన సన్నివేశాలు ఉండాలని, కథ పకడ్బందీగా ఉండాలని, కథనంలో ఆసక్తి ఉండాలని ఆశిస్తారు. ఈ విషయాల్లో ‘కేజీఎఫ్-2’ నిరాశకే గురి చేసింది. ‘కేజీఎఫ్-చాప్టర్ 1’లో ఇవన్నీ ఉంటాయి. చెప్పుకోవడానికి అందులో చాలా కథ ఉంటుంది.
రాకీ అనామకుడిగా ప్రయాణం మొదలుపెట్టి కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే వరకు ఒక జర్నీ ఉంటుంది. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ‘కేజీఎఫ్-2’లో చెప్పుకోవడానికి కథ పెద్దగా ఉండదు. ఆల్రెడీ కేజీఎఫ్ సామ్రాజ్యం రాకీ సొంతమై ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అంతగా కిక్ ఉండదు.
సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో చూడాలి. సినిమా విషయంలో ప్రేక్షకులు పూర్తి సంతృప్తితో లేరన్నది మాత్రం స్పష్టం. ఈ విషయం ‘పుష్ప’ టీం గుర్తిస్తే మంచింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ‘పుష్ప’ మీద కూడా ఇదే తరహాలో భారీ అంచనాలుంటాయి.
మంచి హైప్ రావడం గ్యారెంటీ. ఐతే ఆ హైప్ను నమ్ముకుంటే సరిపోదు. ‘కేజీఎఫ్-2’కు బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చాయి కాబట్టి సరిపోయింది. రిలీజ్ టైమింగ్ కుదరక, గట్టి పోటీ ఉంటే కథ వేరుగా ఉంటుంది. కాబట్టి సుకుమార్ కచ్చితంగా కథాకథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కథ పరంగా ‘పుష్ప’కు, ‘కేజీఎఫ్’కు కూడా కొన్ని పోలికలున్నాయి.
దాని మాదిరే ఫస్ట్ పార్ట్లో హీరో అనామకుడిగా అడుగు పెట్టి పెద్ద సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి సెకండ్ పార్ట్లో పోరాటం ఉండొచ్చు. కానీ అక్కడ ‘కేజీఎఫ్-2’ తరహాలో ఎలివేషన్లతో లాగించేస్తే కుదరదు. కథ పరంగా మలుపుండాలి. కథనంలో ప్రత్యేకత కనిపించాలి. ప్రశాంత్ చేసిన తప్పు సుకుమార్ చేయకుండా తనదైన శైలిలో పకడ్బందీ కథాకథనాలతో మెప్పిస్తాడేమో చూద్దాం.
This post was last modified on April 17, 2022 8:27 am
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…