కేజీఎఫ్-2 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలివేషన్ల విషయంలో, భారీతనంలో, విజువల్ ఎక్స్పీరియన్స్ పరంగా ఈ సినిమా ‘కేజీఎఫ్-1’ కంటే కొన్ని మెట్లు పైనే ఉందని చెప్పాలి. వాటి వరకు ఓ వర్గం ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. కానీ అందరు ప్రేక్షకులూ ఇలా ఉండరు. కేవలం ఎలివేషన్లు చూసి ఆహా ఓహో అనేయరు.
ఆ ఎలివేషన్లకు ముందు బలమైన సన్నివేశాలు ఉండాలని, కథ పకడ్బందీగా ఉండాలని, కథనంలో ఆసక్తి ఉండాలని ఆశిస్తారు. ఈ విషయాల్లో ‘కేజీఎఫ్-2’ నిరాశకే గురి చేసింది. ‘కేజీఎఫ్-చాప్టర్ 1’లో ఇవన్నీ ఉంటాయి. చెప్పుకోవడానికి అందులో చాలా కథ ఉంటుంది.
రాకీ అనామకుడిగా ప్రయాణం మొదలుపెట్టి కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునే వరకు ఒక జర్నీ ఉంటుంది. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. కానీ ‘కేజీఎఫ్-2’లో చెప్పుకోవడానికి కథ పెద్దగా ఉండదు. ఆల్రెడీ కేజీఎఫ్ సామ్రాజ్యం రాకీ సొంతమై ఉంటుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో అంతగా కిక్ ఉండదు.
సినిమాకు ముందు నుంచి ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో చూడాలి. సినిమా విషయంలో ప్రేక్షకులు పూర్తి సంతృప్తితో లేరన్నది మాత్రం స్పష్టం. ఈ విషయం ‘పుష్ప’ టీం గుర్తిస్తే మంచింది. ‘కేజీఎఫ్-2’ తర్వాత ‘పుష్ప’ మీద కూడా ఇదే తరహాలో భారీ అంచనాలుంటాయి.
మంచి హైప్ రావడం గ్యారెంటీ. ఐతే ఆ హైప్ను నమ్ముకుంటే సరిపోదు. ‘కేజీఎఫ్-2’కు బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చాయి కాబట్టి సరిపోయింది. రిలీజ్ టైమింగ్ కుదరక, గట్టి పోటీ ఉంటే కథ వేరుగా ఉంటుంది. కాబట్టి సుకుమార్ కచ్చితంగా కథాకథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కథ పరంగా ‘పుష్ప’కు, ‘కేజీఎఫ్’కు కూడా కొన్ని పోలికలున్నాయి.
దాని మాదిరే ఫస్ట్ పార్ట్లో హీరో అనామకుడిగా అడుగు పెట్టి పెద్ద సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. దాన్ని నిలబెట్టుకోవడానికి సెకండ్ పార్ట్లో పోరాటం ఉండొచ్చు. కానీ అక్కడ ‘కేజీఎఫ్-2’ తరహాలో ఎలివేషన్లతో లాగించేస్తే కుదరదు. కథ పరంగా మలుపుండాలి. కథనంలో ప్రత్యేకత కనిపించాలి. ప్రశాంత్ చేసిన తప్పు సుకుమార్ చేయకుండా తనదైన శైలిలో పకడ్బందీ కథాకథనాలతో మెప్పిస్తాడేమో చూద్దాం.
This post was last modified on April 17, 2022 8:27 am
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…
వైసీపీ అధినేత జగన్.. రాష్ట్రంలోని ఓ వర్గం మీడియాపై తరచుగా విమర్శలు చేయడంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయన…
ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న తమిళ స్టార్ హీరో ధనుష్, అగ్ర కథానాయిక నయనతార.. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా…
ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. తమిళ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్కు... నాలుగేళ్ల ముందు వరకు తమిళనాడులోనే…
బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ తనయ, మాజీ ఎంపీ కవిత ఈ నెలలో…