నేచురల్ స్టార్ నాని కేవలం నటనకు పరిమితం అయిపోకుండా.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చాలా ఏళ్ల కిందట ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారి కొన్నేళ్ల కిందట ‘అ!’ సినిమాను నిర్మించాడు నాని. ఆ సినిమా వియర్శల ప్రశంసలు.. సంతృప్తినిచ్చే స్థాయిలో కాసులు.. వాటితో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు ఉన్న వాళ్లందరికీ ఆ మధ్య ఒకసారి క్లారిటీ ఇచ్చాడు నాని. బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అతను తీర్మానించాడు. ఐతే అంత మంచి ఫలితాన్నిచ్చినప్పటికీ ‘అ!’కు సీక్వెల్ తీయడానికి మాత్రం నాని ముందుకు రాలేదు. నాని పక్కకు తప్పుకోవడంతో వేరే నిర్మాతల కోసం ఎదురు చూసి.. చివరికి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు గత ఏడాది ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
‘అ!’ తర్వాత శైలేష్ కొలను అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘హిట్’ అనే సినిమా తీశాడు నాని. ఆ సినిమా నానికి మరింత మంచి ఫలితాన్నే అందించింది. లాక్డౌన్తో థియేటర్లు షట్ డౌన్ కావడానికి ముందు టాలీవుడ్ చివరి హిట్ ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని సినిమా చివర్లో స్పష్టంగా చెప్పేశారు. తర్వాత దర్శకుడు శైలేష్ కొలను, హీరో విశ్వక్సేన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఐతే నాని ఈ సీక్వెల్ను నిర్మించట్లేదని, శైలేష్ వేరే నిర్మాతకు ఈ సినిమా చేస్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని అంటున్నాడు శైలేష్. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడిన శైలేష్.. తన తర్వాతి సినిమా ‘హిట్-2’నే అని.. దాన్ని నానీనే నిర్మిస్తున్నాడని స్పష్టత ఇస్తున్నాడు. మరి ప్రశాంత్కు హ్యాండిచ్చిన నాని.. శైలేష్తో సీక్వెల్ చేయడానికి అతడిలో ఏం నచ్చిందో చూడాలి. చూస్తుంటే ‘హిట్’ సిరీస్లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ నానీనే నిర్మించేట్లుంది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…