నేచురల్ స్టార్ నాని కేవలం నటనకు పరిమితం అయిపోకుండా.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చాలా ఏళ్ల కిందట ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారి కొన్నేళ్ల కిందట ‘అ!’ సినిమాను నిర్మించాడు నాని. ఆ సినిమా వియర్శల ప్రశంసలు.. సంతృప్తినిచ్చే స్థాయిలో కాసులు.. వాటితో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు ఉన్న వాళ్లందరికీ ఆ మధ్య ఒకసారి క్లారిటీ ఇచ్చాడు నాని. బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అతను తీర్మానించాడు. ఐతే అంత మంచి ఫలితాన్నిచ్చినప్పటికీ ‘అ!’కు సీక్వెల్ తీయడానికి మాత్రం నాని ముందుకు రాలేదు. నాని పక్కకు తప్పుకోవడంతో వేరే నిర్మాతల కోసం ఎదురు చూసి.. చివరికి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు గత ఏడాది ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
‘అ!’ తర్వాత శైలేష్ కొలను అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘హిట్’ అనే సినిమా తీశాడు నాని. ఆ సినిమా నానికి మరింత మంచి ఫలితాన్నే అందించింది. లాక్డౌన్తో థియేటర్లు షట్ డౌన్ కావడానికి ముందు టాలీవుడ్ చివరి హిట్ ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని సినిమా చివర్లో స్పష్టంగా చెప్పేశారు. తర్వాత దర్శకుడు శైలేష్ కొలను, హీరో విశ్వక్సేన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఐతే నాని ఈ సీక్వెల్ను నిర్మించట్లేదని, శైలేష్ వేరే నిర్మాతకు ఈ సినిమా చేస్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని అంటున్నాడు శైలేష్. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడిన శైలేష్.. తన తర్వాతి సినిమా ‘హిట్-2’నే అని.. దాన్ని నానీనే నిర్మిస్తున్నాడని స్పష్టత ఇస్తున్నాడు. మరి ప్రశాంత్కు హ్యాండిచ్చిన నాని.. శైలేష్తో సీక్వెల్ చేయడానికి అతడిలో ఏం నచ్చిందో చూడాలి. చూస్తుంటే ‘హిట్’ సిరీస్లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ నానీనే నిర్మించేట్లుంది.
This post was last modified on June 22, 2020 1:50 pm
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…
కోలీవుడ్ లో నిన్నటిదాకా ఎక్కువ వినిపించిన పేరు అనిరుధ్ రవిచందర్. అయితే కూలితో సహా తన వరస సినిమాలు ఆశించిన…
తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న…
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు…