నేచురల్ స్టార్ నాని కేవలం నటనకు పరిమితం అయిపోకుండా.. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చాలా ఏళ్ల కిందట ‘డి ఫర్ దోపిడీ’ అనే సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు. అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా మారి కొన్నేళ్ల కిందట ‘అ!’ సినిమాను నిర్మించాడు నాని. ఆ సినిమా వియర్శల ప్రశంసలు.. సంతృప్తినిచ్చే స్థాయిలో కాసులు.. వాటితో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ మీద సందేహాలు ఉన్న వాళ్లందరికీ ఆ మధ్య ఒకసారి క్లారిటీ ఇచ్చాడు నాని. బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఆ సినిమా సూపర్ హిట్ అని అతను తీర్మానించాడు. ఐతే అంత మంచి ఫలితాన్నిచ్చినప్పటికీ ‘అ!’కు సీక్వెల్ తీయడానికి మాత్రం నాని ముందుకు రాలేదు. నాని పక్కకు తప్పుకోవడంతో వేరే నిర్మాతల కోసం ఎదురు చూసి.. చివరికి ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు గత ఏడాది ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
‘అ!’ తర్వాత శైలేష్ కొలను అనే మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ‘హిట్’ అనే సినిమా తీశాడు నాని. ఆ సినిమా నానికి మరింత మంచి ఫలితాన్నే అందించింది. లాక్డౌన్తో థియేటర్లు షట్ డౌన్ కావడానికి ముందు టాలీవుడ్ చివరి హిట్ ఇదే కావడం విశేషం. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతోందని సినిమా చివర్లో స్పష్టంగా చెప్పేశారు. తర్వాత దర్శకుడు శైలేష్ కొలను, హీరో విశ్వక్సేన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఐతే నాని ఈ సీక్వెల్ను నిర్మించట్లేదని, శైలేష్ వేరే నిర్మాతకు ఈ సినిమా చేస్తున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని అంటున్నాడు శైలేష్. తాజాగా ఓ ఇంగ్లిష్ డైలీతో మాట్లాడిన శైలేష్.. తన తర్వాతి సినిమా ‘హిట్-2’నే అని.. దాన్ని నానీనే నిర్మిస్తున్నాడని స్పష్టత ఇస్తున్నాడు. మరి ప్రశాంత్కు హ్యాండిచ్చిన నాని.. శైలేష్తో సీక్వెల్ చేయడానికి అతడిలో ఏం నచ్చిందో చూడాలి. చూస్తుంటే ‘హిట్’ సిరీస్లో ఎన్ని సినిమాలొస్తే అన్నీ నానీనే నిర్మించేట్లుంది.
This post was last modified on June 22, 2020 1:50 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…