కేజీఎఫ్-2.. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా హైప్ తెచ్చుకున్న సినిమా. ‘బాహుబలి-2’కు దీటుగా వసూళ్లు రాబడుతూ ఆల్ టైం రికార్డులు కూడా బద్దలుకొడుతోందా చిత్రం. ఇంత భారీ చిత్రానికి ఎడిటర్గా పని చేసిన వ్యక్తి కాకలు తీరిన అనుభవశాలే అయ్యుంటాడని అనుకుంటాం.
ఇలాంటి భారీ చిత్రాలకు మామూలుగా ఎంతో అనుభవం ఉన్న, పేరున్న ఎడిటర్లనే పెట్టుకుంటారు. ఐతే ‘కేజీఎఫ్-2’కు పని చేసిన ఎడిటర్ వయసు కేవలం 19 ఏళ్లు అంటే నమ్మగలరా? ఈ చిత్రానికి పని మొదలుపెట్టే సమయానికి అతడి వయసు ఇంకా రెండేళ్లు తక్కువే అంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా?
అవును.. ‘కేజీఎఫ్-2’ ఎడిటర్ ఇంకా టీనేజరే. అతడి పేరు ఉజ్వల్ కులకర్ణి. ఇంత చిన్న వయసులో ఇంత భారీ చిత్రానికి ఎడిటర్గా పని చేయడం అంటే మాటలా? కానీ టాలెంటుకి వయసుతో సంబంధం లేదని రుజువు చేస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు ఉజ్వల్.
చిన్న వయసులోనే ఫిలిం ఎడిటింగ్లో మెలకువలు నేర్చుకుని.. షార్ట్ ఫిలిమ్స్కు సాంకేతిక సహకారం అందిస్తూ.. ఫ్యాన్ ఎడిట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు ఉజ్వల్. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-1’కు సంబంధించి ఒక అదిరిపోయే ఎడిట్ చేశాడు.
అది అనుకోకుండా ప్రశాంత్ కళ్లలో పడింది. ఆయనకు అది బాగా నచ్చేసి.. ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసే బాధ్యత అప్పగించాడు. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసింది అతనే. దానికి అదిరిపోయే స్పందన రావడంతో మొత్తంగా సినిమాను ఎడిట్ చేసే బాధ్యతను అతడికి అప్పగించాడు ప్రశాంత్.
ఒక్క నిమిషంలో పదుల సంఖ్యలో షాట్లు కనిపించే‘కేజీఎఫ్-2’ లాంటి సినిమాలకు ఎడిటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో అనుభవం ఉన్నా కూడా సవాలుతో కూడుకున్న విషయం ఇది. అలాంటిది ఇంకా మీసాలు కూడా రాని, పిల్లాడిలా కనిపిస్తున్న ఉజ్వల్ ఇంత భారీ చిత్రానికి పని చేశాడంటే ఎంత స్ఫూర్తిదాయక విషయమో కదా.
This post was last modified on April 15, 2022 5:49 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…