కేజీఎఫ్-2.. బాహుబలి-2 తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా హైప్ తెచ్చుకున్న సినిమా. ‘బాహుబలి-2’కు దీటుగా వసూళ్లు రాబడుతూ ఆల్ టైం రికార్డులు కూడా బద్దలుకొడుతోందా చిత్రం. ఇంత భారీ చిత్రానికి ఎడిటర్గా పని చేసిన వ్యక్తి కాకలు తీరిన అనుభవశాలే అయ్యుంటాడని అనుకుంటాం.
ఇలాంటి భారీ చిత్రాలకు మామూలుగా ఎంతో అనుభవం ఉన్న, పేరున్న ఎడిటర్లనే పెట్టుకుంటారు. ఐతే ‘కేజీఎఫ్-2’కు పని చేసిన ఎడిటర్ వయసు కేవలం 19 ఏళ్లు అంటే నమ్మగలరా? ఈ చిత్రానికి పని మొదలుపెట్టే సమయానికి అతడి వయసు ఇంకా రెండేళ్లు తక్కువే అంటే ఆశ్చర్యపోకుండా ఉండగలరా?
అవును.. ‘కేజీఎఫ్-2’ ఎడిటర్ ఇంకా టీనేజరే. అతడి పేరు ఉజ్వల్ కులకర్ణి. ఇంత చిన్న వయసులో ఇంత భారీ చిత్రానికి ఎడిటర్గా పని చేయడం అంటే మాటలా? కానీ టాలెంటుకి వయసుతో సంబంధం లేదని రుజువు చేస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు ఉజ్వల్.
చిన్న వయసులోనే ఫిలిం ఎడిటింగ్లో మెలకువలు నేర్చుకుని.. షార్ట్ ఫిలిమ్స్కు సాంకేతిక సహకారం అందిస్తూ.. ఫ్యాన్ ఎడిట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు ఉజ్వల్. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-1’కు సంబంధించి ఒక అదిరిపోయే ఎడిట్ చేశాడు.
అది అనుకోకుండా ప్రశాంత్ కళ్లలో పడింది. ఆయనకు అది బాగా నచ్చేసి.. ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసే బాధ్యత అప్పగించాడు. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పూనకాలు తెప్పించిన ‘కేజీఎఫ్-2’కు టీజర్ కట్ చేసింది అతనే. దానికి అదిరిపోయే స్పందన రావడంతో మొత్తంగా సినిమాను ఎడిట్ చేసే బాధ్యతను అతడికి అప్పగించాడు ప్రశాంత్.
ఒక్క నిమిషంలో పదుల సంఖ్యలో షాట్లు కనిపించే‘కేజీఎఫ్-2’ లాంటి సినిమాలకు ఎడిటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఎంతో అనుభవం ఉన్నా కూడా సవాలుతో కూడుకున్న విషయం ఇది. అలాంటిది ఇంకా మీసాలు కూడా రాని, పిల్లాడిలా కనిపిస్తున్న ఉజ్వల్ ఇంత భారీ చిత్రానికి పని చేశాడంటే ఎంత స్ఫూర్తిదాయక విషయమో కదా.
This post was last modified on April 15, 2022 5:49 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…