‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా ‘ది కంక్లూజన్’ వచ్చాక ప్రేక్షకులు ‘బాహుబలి-3’ పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ఈ కథను పొడిగిస్తే బాగుంటుందని, ఆ అద్భుత ప్రపంచాన్ని మరోసారి వెండితెరపైకి తెస్తే భలే ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. ఈ కథను కొనసాగించే ఉద్దేశమే లేదని అంటూ బాహుబలి ప్రపంచాన్ని కొనసాగించే అవకాశం ఉందని నర్మగర్భమైన కామెంట్ ఒకటి చేశాడు.
అంటే ఈ కథను అంతటితో వదిలేసి ఆ తరహా భారీ చిత్రం ఇంకోటి చేస్తాడేమో అనుకున్నారు. కానీ సమీప భవిష్యత్తులో అలాంటి సినిమా ఏదీ తెరకెక్కేలా కనిపించడం లేదు. ఇకపోతే ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులను వెర్రెత్తించిన ‘కేజీఎఫ్’ నుంచి కొత్త సీక్వెల్ వస్తుందనే సంకేతాలు రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. శుక్రవారం రిలీజైన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అంతా అయ్యాక చూపించిన సీన్ చూసి అంతా షాక్ అయ్యారు.
‘కేజీఎఫ్-3’ ఉంటుందనే సంకేతాలు ఇప్పటిదాకా ఆ చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు. ప్రశాంత్ కూడా దాని గురించి ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. కానీ ‘చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అయిపోవస్తున్న దశలో రవీనా టాండన్ ‘కేజీఎఫ్ చాప్టర్-3’ అనే కొత్త పుస్తకం ముఖచిత్రాన్ని చూస్తున్న దృశ్యం పెట్టడంతో ఈ సిరీస్లో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయని అర్థమైంది. ఐతే ఇందులో ఇలా చూపించారని కచ్చితంగా మూడో పార్ట్ వస్తుందని అనుకోలేం.
ఎందుకంటే సెకండ్ పార్ట్కు ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం. ఈ చిత్రానికి మిక్స్డ్ టాకే వస్తోంది ప్రస్తుతానికి. ఎలివేషన్లు, భారీతనం పక్కన పెడితే చాలా విషయాల్లో ‘కేజీఎఫ్-2’ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే బలహీనమే. సెకండ్ పార్ట్ చూస్తుంటేనే ఓవర్ డోస్ ఫీలింగ్ కూడా కలిగింది. ఇందులో పెద్దగా కథే లేదు. బలవంతంగా సాగదీసినట్లు అనిపించింది.
ఇక ఈ కథను ఇంతకుమించి విస్తరించడానికి ఏం స్కోప్ ఉంది? సెకండ్ పార్టే ప్రేక్షకులను నిరాశకు గురి చేసినపుడు ఇంకో భాగం గురించి ఆలోచించడం కరెక్ట్ అనిపించుకోదు. బహుశా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి రిజల్ట్ విషయంలో ఒక అంచనాకు వచ్చాక ఇంకో భాగం తీయాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారేమో.
This post was last modified on April 14, 2022 3:07 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…