‘బాహుబలి: ది బిగినింగ్’కు కొనసాగింపుగా ‘ది కంక్లూజన్’ వచ్చాక ప్రేక్షకులు ‘బాహుబలి-3’ పట్ల ఆసక్తి ప్రదర్శించారు. ఈ కథను పొడిగిస్తే బాగుంటుందని, ఆ అద్భుత ప్రపంచాన్ని మరోసారి వెండితెరపైకి తెస్తే భలే ఉంటుందని అనుకున్నారు. కానీ రాజమౌళి అలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. ఈ కథను కొనసాగించే ఉద్దేశమే లేదని అంటూ బాహుబలి ప్రపంచాన్ని కొనసాగించే అవకాశం ఉందని నర్మగర్భమైన కామెంట్ ఒకటి చేశాడు.
అంటే ఈ కథను అంతటితో వదిలేసి ఆ తరహా భారీ చిత్రం ఇంకోటి చేస్తాడేమో అనుకున్నారు. కానీ సమీప భవిష్యత్తులో అలాంటి సినిమా ఏదీ తెరకెక్కేలా కనిపించడం లేదు. ఇకపోతే ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులను వెర్రెత్తించిన ‘కేజీఎఫ్’ నుంచి కొత్త సీక్వెల్ వస్తుందనే సంకేతాలు రావడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. శుక్రవారం రిలీజైన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అంతా అయ్యాక చూపించిన సీన్ చూసి అంతా షాక్ అయ్యారు.
‘కేజీఎఫ్-3’ ఉంటుందనే సంకేతాలు ఇప్పటిదాకా ఆ చిత్ర బృందం నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు. ప్రశాంత్ కూడా దాని గురించి ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. కానీ ‘చాప్టర్-2’ రోలింగ్ టైటిల్స్ అయిపోవస్తున్న దశలో రవీనా టాండన్ ‘కేజీఎఫ్ చాప్టర్-3’ అనే కొత్త పుస్తకం ముఖచిత్రాన్ని చూస్తున్న దృశ్యం పెట్టడంతో ఈ సిరీస్లో ఇంకో సినిమా వచ్చే అవకాశాలున్నాయని అర్థమైంది. ఐతే ఇందులో ఇలా చూపించారని కచ్చితంగా మూడో పార్ట్ వస్తుందని అనుకోలేం.
ఎందుకంటే సెకండ్ పార్ట్కు ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం. ఈ చిత్రానికి మిక్స్డ్ టాకే వస్తోంది ప్రస్తుతానికి. ఎలివేషన్లు, భారీతనం పక్కన పెడితే చాలా విషయాల్లో ‘కేజీఎఫ్-2’ ఫస్ట్ పార్ట్తో పోలిస్తే బలహీనమే. సెకండ్ పార్ట్ చూస్తుంటేనే ఓవర్ డోస్ ఫీలింగ్ కూడా కలిగింది. ఇందులో పెద్దగా కథే లేదు. బలవంతంగా సాగదీసినట్లు అనిపించింది.
ఇక ఈ కథను ఇంతకుమించి విస్తరించడానికి ఏం స్కోప్ ఉంది? సెకండ్ పార్టే ప్రేక్షకులను నిరాశకు గురి చేసినపుడు ఇంకో భాగం గురించి ఆలోచించడం కరెక్ట్ అనిపించుకోదు. బహుశా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసి రిజల్ట్ విషయంలో ఒక అంచనాకు వచ్చాక ఇంకో భాగం తీయాలా వద్దా అనే విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారేమో.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…