Movie News

సుశాంత్ సూసైడ్.. శ్రీదేవి కూతురిపై ఎఫెక్ట్!

గతంలో మాదిరిగా ఒక మనిషిని నేరస్తుడిగా తీర్మానించే హక్కు కేవలం కోర్టులకు లేదిప్పుడు. సోషల్ మీడియానే ఎవరు నిందితుడు, ఏ సమస్యకు ఎవరు బాధ్యుడు అని తీర్పు ఇచ్చేస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడనేది ఎవరికీ తెలియదు. అతను కారణం చెప్పి చనిపోలేదు. కానీ అతని చావుకి సోషల్ మీడియా ఇప్పటికే చాలా మందిని నిందితులుగా నిలబెట్టింది.

అందరికంటే ఎక్కువగా సినిమావాళ్ళ వారసులను ప్రోత్సహించి, నెపోటిజంకి బ్రాండ్ అంబాసడర్ అనిపించుకున్న కరణ్ జోహార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మాములుగా ఇలాంటి వాటిని దులిపేసుకునే కరణ్ ఈసారి పెల్లుబికిన ఆగ్రహంతో సైలెంట్ గా ఉంటున్నాడు. ఇప్పుడు తానూ ఏ కారణంతో వచ్చినా కానీ తిట్టిపోస్తారని అతనికి తెలుసు. అందుకే ఈ వేడి చల్లారే వరకు సైలెంట్ అయిపోయాడు. అయితే అతను సైలెంట్ అవడం శ్రీదేవి కూతురు జాన్వీకి ఇబ్బందిగా మారింది.

ఆమె నటించిన గుంజన్ సక్సేనా చిత్రాన్ని కరణ్ నిర్మించాడు. అది డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. సరిగ్గా దాని ప్రమోషన్ మొదలయ్యే సమయానికి సుషాంత్ సూసైడ్ న్యూస్ రావడంతో కరణ్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. థియేటర్లలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం తప్పనిసరి పరిస్థితులలో డిజిటల్ రిలీజ్ కి వెళితే ఇక్కడ కూడా సరైన పబ్లిసిటీ చేసుకోలేని పరిస్థితి తలెత్తింది పాపం.

This post was last modified on June 22, 2020 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

3 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

5 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

8 hours ago