తెలుగులో మూడేళ్ల కిందట వచ్చిన నాని సినిమా ‘జెర్సీ’ ఒక క్లాసిక్గా పేరు తెచ్చుకుంది. కమర్షియల్గా ఇంకా పెద్ద సక్సెస్ కావాల్సిన ఆ సినిమా ఓ మోస్తరు విజయంతో సరిపెట్టుకుంది. ఐతే థియేటర్లలో నుంచి వెళ్లిపోయాక ఆ సినిమా గొప్పదనమేంటో అందరికీ అర్థమైంది. ఓటీటీలో చూసి దీన్నో కల్ట్ మూవీగా కొనియాడారు అందరూ. బాలీవుడ్ వాళ్లకు ఈ చిత్రం తెగ నచ్చేసి షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీలో మొదలైనపుడే స్యూర్ షాట్ హిట్ అన్న అభిప్రాయాలు కలిగాయి.
తెలుగు వెర్షన్ ప్రొడ్యూసర్ నాగవంశీ, టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ కలిసి ఈ చిత్రాన్ని ఒరిజినల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఐతే కరోనా సహా పలు కారణాలతో ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. గత ఏడాది డిసెంబరు 31న విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేశాక కొవిడ్ థర్డ్ వేవ్ ధాటికి సినిమాను హఠాత్తుగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఏప్రిల్ 14వ తేదీకి సినిమాను షెడ్యూల్ చేసి ‘కేజీఎఫ్-2’ దూకుడుతో భయపడి 22వ తేదీకి సినిమాను పోస్ట్ పోన్ చేశారు.
ఐతే ఇప్పుడు మళ్లీ ‘జెర్సీ’కి కొత్త తలనొప్పి మొదలైంది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడం నిర్మాతలను టెన్షన్ పెడుతోంది. ఆల్రెడీ తెలుగులో రిలీజైన మూడేళ్లు దాటాక, దాని హిందీ వెర్షన్ రిలీజ్కు ముందు ఈ కథను కాపీ కొట్టారంటూ ఓ రచయిత కోర్టు మెట్లు ఎక్కడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ రచయిత పేరు రూపేశ్ జైశ్వాల్. 2007లో తాను ‘ది వాల్’ పేరుతో ఓ కథ రాసి.. స్క్రిప్టును రిజిస్టర్ కూడా చేయించానని.. తాను రాసిన కథలో కథంతా ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరుగుతుందని, పూర్తిగా క్రికెట్ నేపథ్యంలోనే నడిచే ఆ కథలో కుటుంబం, ప్రేమ, ఆశయం లాంటి అంశాలు ప్రధానంగా ఉంటాయని.. ఆ కథను కాపీ కొట్టే ‘జెర్సీ’ సినిమా తీశారని సదరు రచయితగా కోర్టులో పిటిషన్ వేయడం గమనార్హం.
ఐతే ‘జెర్సీ’ కథ రాసింది.. సినిమా తీసింది ఒక తెలుగు దర్శకుడు. అతను ముందు తెలుగులో ఈ సినిమా తీశాడు. అప్పుడు ఎవరి నుంచి ఏ అభ్యంతరాలు రాలేదు. ఇప్పుడు అదే సినిమా హిందీలో రీమేక్ అయితే.. ఓ హిందీ రచయిత ఈ కథ తనదంటూ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఈ అడ్డంకిని ‘జెర్సీ’ టీం ఎలా అధిగమిస్తుందో చూడాలి.
This post was last modified on April 13, 2022 3:02 pm
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలతో మొదలుకుని కమెడియన్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్,…
డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా?…
అన్యోన్య కాపురమే.. వైవాహిక బంధానికి.. చూడముచ్చటైన జంటకు.. నిదర్శనం. అయితే.. కారణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్ను ఈ నెల 20 లేదా 21న సభలో…
నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాయింట్ ఇండస్ట్రీ వర్గాలతో…
ఈ నెల 19న జరిగే ఉగాది తర్వాత ఏ క్షణమైనా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన…