కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. కర్ణాటక అవతల ఎవరికీ పరిచయం లేని యశ్ అనే హీరోను పెట్టి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చి అన్ని చోట్లా కేజీఎఫ్ సినిమాను బ్లాక్బస్టర్ చేసిన దర్శకుడతను. అలాంటి దర్శకుడితో మన సూపర్ స్టార్లు సినిమాలు చేస్తే ఎలా ఉంటుందా అన్న ఊహ కేజీఎఫ్ చూడగానే తెలుగు ప్రేక్షకులు చాలామందికి కలిగింది. ఈ ఆశల మన హీరోలు, నిర్మాతల్లోనూ పుట్టి చకచకా ప్రాజెక్టులు సెట్ అయిపోయాయి.
కేజీఎఫ్-2 రిలీజ్ కాకముందే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో సలార్ సినిమాను మొదలుపెట్టేశాడు ప్రశాంత్. దీంతో పాటే జూనియర్ ఎన్టీఆర్తోనూ ఓ సినిమా ఓకే అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమాను చాన్నాళ్ల ముందే అనౌన్స్ చేశారు.
కాగా ప్రశాంత్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని నెలల కిందట జోరుగా ప్రచారం జరిగింది. మీడియాలో అన్ని చోట్లా ఈ మేరకు వార్తలు కూడా వచ్చేశాయి. అందుక్కారణం.. ప్రశాంత్ ఆ మధ్య చిరంజీవి, చరణ్లను వారి ఇంట్లో వ్యక్తిగతంగా కలుసుకోవడం, ఈ కలయిక గురించి చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టడం. చరణ్, ప్రశాంత్ తమ చేతుల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేశాక కలిసి సినిమా చేస్తారని భావించారు.
ఐతే ఇప్పుడు ఈ ప్రచారానికి ప్రశాంత్ తెరదించేశాడు. ప్రస్తుతానికి తాను కమిటైన సినిమాలు సలార్, తారక్తో చేయబోయే చిత్రం మాత్రమేనని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఆ తర్వాత తాను తన తొలి చిత్రం ఉగ్రం కథానాయకుడు మురళీతో ఓ సినిమా చేస్తానని.. ఆపై యశ్తో ఇంకో సినిమా చేస్తానని తెలిపాడు. ఇవి కాక ఏ సినిమా ఒప్పుకోలేదన్నాడు. ఇక కేజీఎఫ్ తర్వాత వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుండటం గురించి అడిగితే.. తనకు తానుగా ఏ తెలుగు హీరోనూ సంప్రదించలేదని, వాళ్లే తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారని ప్రశాంత్ చెప్పడం గమనార్హం.
This post was last modified on April 11, 2022 9:08 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…