మీరా చోప్రా గుర్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బంగారంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ.. ఆ తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది. ఐతే తెలుగులో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో చాలా త్వరగా కనుమరుగైపోయింది. వేరే భాషల్లో కూడా మీరాకు విజయాలు దక్కలేదు. ఆమెను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన టైంలో ఎన్టీఆర్ అభిమానుల పుణ్యమా అని ఆ మధ్య సోషల్ మీడియాలో తన పేరు హాట్ టాపిక్ అయింది.
సోషల్ మీడియాలో ఇలాంటి కెరీర్ ముగిసిన హీరోయిన్లు చిట్ చాట్లు పెట్టడం మామూలే. అలాంటి వాళ్లను ఫ్యాన్స్ తమ హీరోల గురించి ఓ మాట చెప్పమని అడగడమూ సహజమే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మీరాను అడిగితే.. ఎవరు ఎన్టీఆర్ అంటూ ఆమె వెటకారమాడింది. దీంతో తారక్ ఫ్యాన్స్కు ఒళ్లు మండి ఆమెను బూతులు తిట్టారు. తర్వాత ఆమె వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం.
ఇందులో సోషల్ మీడియాలో ఉండే ఊరూ పేరు లేని అభిమానుల తప్పుందే తప్ప.. ఎన్టీఆర్ను నిందించడానికి ఏమైనా ఉందా? ఐతే ఇప్పుడేమాత్రం పని లేని మీరా మాత్రం.. పనిగట్టుకుని తారక్ను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న సౌత్ సినిమాలు, స్టార్ల గురించి ఒక అప్రిసియేషన్ ట్వీట్ వేసింది.
అందులో భాగంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్ల పేర్లు ప్రస్తావించి వారిని కొనియాడింది. ఐతే ఆర్ఆర్ఆర్లో భాగమైన చరణ్ను మాత్రం పొగిడి.. తారక్ పేరును విస్మరించడం అతి కాక మరేంటి? ఇది కావాలనే తారక్ ఫ్యాన్స్ను గిల్లడం తప్ప మరేమీ కాదు. ఇంతకుముందు తారక్ ఫ్యాన్స్ చేసింది తప్పే అయినా.. మీరా అటెన్షన్ కోసమే వారిని కవ్వించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈసారి ఆమె చేసింది మరీ అతిగా ఉంది. కచ్చితంగా ఇది అటెన్షన్ కోసమే వేసిన ఎత్తుగడ అనడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 10, 2022 2:25 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…