మీరా చోప్రా గుర్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బంగారంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ.. ఆ తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు లాంటి మరికొన్ని చిత్రాల్లోనూ నటించింది. ఐతే తెలుగులో ఆమె నటించిన ఒక్క సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో చాలా త్వరగా కనుమరుగైపోయింది. వేరే భాషల్లో కూడా మీరాకు విజయాలు దక్కలేదు. ఆమెను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన టైంలో ఎన్టీఆర్ అభిమానుల పుణ్యమా అని ఆ మధ్య సోషల్ మీడియాలో తన పేరు హాట్ టాపిక్ అయింది.
సోషల్ మీడియాలో ఇలాంటి కెరీర్ ముగిసిన హీరోయిన్లు చిట్ చాట్లు పెట్టడం మామూలే. అలాంటి వాళ్లను ఫ్యాన్స్ తమ హీరోల గురించి ఓ మాట చెప్పమని అడగడమూ సహజమే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మీరాను అడిగితే.. ఎవరు ఎన్టీఆర్ అంటూ ఆమె వెటకారమాడింది. దీంతో తారక్ ఫ్యాన్స్కు ఒళ్లు మండి ఆమెను బూతులు తిట్టారు. తర్వాత ఆమె వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది వ్యవహారం.
ఇందులో సోషల్ మీడియాలో ఉండే ఊరూ పేరు లేని అభిమానుల తప్పుందే తప్ప.. ఎన్టీఆర్ను నిందించడానికి ఏమైనా ఉందా? ఐతే ఇప్పుడేమాత్రం పని లేని మీరా మాత్రం.. పనిగట్టుకుని తారక్ను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఆమె పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న సౌత్ సినిమాలు, స్టార్ల గురించి ఒక అప్రిసియేషన్ ట్వీట్ వేసింది.
అందులో భాగంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యశ్ల పేర్లు ప్రస్తావించి వారిని కొనియాడింది. ఐతే ఆర్ఆర్ఆర్లో భాగమైన చరణ్ను మాత్రం పొగిడి.. తారక్ పేరును విస్మరించడం అతి కాక మరేంటి? ఇది కావాలనే తారక్ ఫ్యాన్స్ను గిల్లడం తప్ప మరేమీ కాదు. ఇంతకుముందు తారక్ ఫ్యాన్స్ చేసింది తప్పే అయినా.. మీరా అటెన్షన్ కోసమే వారిని కవ్వించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈసారి ఆమె చేసింది మరీ అతిగా ఉంది. కచ్చితంగా ఇది అటెన్షన్ కోసమే వేసిన ఎత్తుగడ అనడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు.
This post was last modified on April 10, 2022 2:25 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…