పూరి జగన్నాథ్ గురించి మెగాస్టార్ చిరంజీవి శనివారం ఉదయం వేసిన ట్వీట్ వైరల్ అయింది. తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో పూరి జగన్నాథ్ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ, పూరితో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నర్సీపట్నం నుంచి ఓకుర్రాడు వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా. అందుకే Introducing my puri jagan in a special role, from the sets of Godfather’’ అని చిరు పేర్కొన్నాడు.
చిరు ఈ ట్వీట్ అలా వేశారో లేదో.. ఇలా వైరల్ అయిపోయింది. ‘గాడ్ ఫాదర్’లో పూరి నటిస్తున్న విషయం ఇంతకుముందే చూచాయిగా వెల్లడైంది. ఇప్పుడు చిరునే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో పూరిది ఒక జర్నలిస్టు పాత్రగా చెబుతున్నారు. పూరి ఇంతకుముందే ‘ఏమాయ చేసావె’ సహా కొన్ని సినిమాల్లో క్యామియో తరహా పాత్రలు చేశారు.
ఐతే వాటితో పోలిస్తే ఇందులో పూరి రోల్ నిడివి కాస్త ఎక్కువే ఉంటుందని అంటున్నారు. ఐతే నటుడవ్వాలనే పూరి కల గురించి చిరు బాగానే చెప్పారు. పూర్తి స్థాయి నటుడిగా పూరిని పరిచయం చేస్తుండటం సంతోషమే. కానీ పూరీకి ఇంతకుమించిన కల ఒకటి ఉంది. అదే.. చిరంజీవిని డైరెక్ట్ చేయాలని. గత రెండు దశాబ్దాల్లో టాలీవుడ్లో పీక్స్ చూసిన దర్శకుల్లో పూరి ఒకరు. చిరును డైరెక్ట్ చేయడానికి ఆయన అన్ని విధాలుగా అర్హుడు. కాకపోతే పోకిరి, దేశముదురు లాంటి చిత్రాలతో పూరి కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో చిరు సినిమాలకు దూరమవ్వడం ఆయన దురదృష్టం.
చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్నపుడు ‘ఆటో జానీ’ అనే కథతో ఆయన పునరాగమన చిత్రాన్ని తనే డైరెక్ట్ చేయడానికి పూరి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ ఆ కథలో సెకండాఫ్ నచ్చక చిరు ఓకే చెప్పలేదు. తర్వాత ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చి వేరే సినిమాలతో బిజీ అయిపోయారు. పూరి ఒకప్పటంత ఊపులో లేకపోయినా.. బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో చిరు పని చేస్తున్నపుడు పూరితో సినిమా చేయడంలో ఇబ్బందేముంది? మరి పూరి ఈ కలను కూడా మెగాస్టార్ నెరవేరుస్తాడేమో చూడాలి.
This post was last modified on April 9, 2022 7:49 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…