వెండితెరపై శ్రీమంతుడి పాత్రలో తనదైన ముద్ర వేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమా ప్రభావమో ఏమో కానీ.. నిజ జీవితంలోనూ ఆయన శ్రీమంతుడి తరహాలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులు గెలుస్తున్నాడు. శ్రీమంతుడు కాన్సెప్ట్ను నిజ జీవితానికి కూడా అన్వయించి ఆంధ్రా, తెలంగాణల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి కోసం కోట్ల రూపాయలు మహేష్ ఖర్చు చేయడం తెలిసిందే.
ఇదంతా ఒకెత్తయితే చాలా ఏళ్ల నుంచి అనారోగ్యంతో బాధ పడే చిన్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయిస్తూ వారి ఇళ్లలో వెలుగులు నింపుతున్నాడు మహేష్. ఇలా పది మందికో, 20 మందికో, లేక వంద మందికో కాదు.. ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి వారి ప్రాణాలు నిలిపిన ఘనత మహేష్కు చెందుతుంది.
ఇప్పుడు ఈ సేవను మహేష్ మరో స్థాయికి తీసుకెళ్తున్నట్లే కనిపిస్తోంది. ఒక్క రోజులో మహేష్ తోడ్పాటుతో 30 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు జరగడం విశేషం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్లో మహేష్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ వెల్లడించింది.
సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అయింది. మహేష్ గొప్ప మనసును అందరూ కొనియాడుతున్నారు. అతను నిజ జీవిత శ్రీమంతుడని కీర్తిస్తున్నారు. తన కొడుకు పుట్టినపుడు చాలా తక్కువ బరువుతో ఉన్నాడని.. అప్పుడు ఎంతో ఖర్చు పెట్టుకుంటే మామూలు స్థితికి వచ్చాడని, మరి పేదలకు ఇలాంటి కష్టం వస్తే ఎలా అని ఆలోచించి అనారోగ్యంతో ఉన్న చిన్న పిల్లలకు ఇలా తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో మహేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 8, 2022 9:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…