దాదాపు ఏడాదిన్నర కిందట ఇంకా షూటింగ్ మొదలు కాకముందే టైటిల్, ప్రి లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది సలార్ టీం. ఐతే ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. సినిమా షూటింగ్ గురించి కూడా ఏ అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎంత పూర్తయింది, టాకీ పార్ట్ ఎప్పుడవుతుంది.. సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం కేజీఎఫ్-చాప్టర్ 2 మీదే ఉంది. వచ్చే శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజు సలార్ టీజర్ లాంచ్ అవుతుందంటూ ఇప్పుడు గట్టి ప్రచారం జరుగుతుండటం విశేషం. దీని గురించి బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు బయటికి రావడం విశేషం. కేజీఎఫ్-2 సినిమా ఇంటర్వెల్లో సలార్ టీజర్ను ప్రదర్శిస్తారని.. ఈ సినిమా ప్రింట్లతో పాటు సలార్ టీజర్ను ఎటాచ్ చేస్తున్నారని.. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇస్తున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా సలార్ ట్రెండ్ అయిపోతోంది. ప్రభాస్ అభిమానులు ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా సలార్ నుంచి ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఫస్ట్ లుక్కే రిలీజ్ కాలేదు. కేజీఎఫ్-2 ప్రమోషన్ల మీద దృష్టిపెట్టిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ టీజర్ పని పెట్టుకుంటాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయినా ఇంత పెద్ద సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారంటే ముందు కొంచెం ప్రమోషనల్ హంగామా ఉండాలి. ఇప్పటిదాకా అయితే అలాంటిదేమీ కనిపించడం లేదు. మరి బాలీవుడ్ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కేజీఎఫ్-2 సినిమా మధ్యలో సలార్ టీజర్ ప్రదర్శితమవుతుందా అన్నది చూడాలి.
This post was last modified on April 8, 2022 8:50 am
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…