దాదాపు ఏడాదిన్నర కిందట ఇంకా షూటింగ్ మొదలు కాకముందే టైటిల్, ప్రి లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది సలార్ టీం. ఐతే ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. సినిమా షూటింగ్ గురించి కూడా ఏ అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎంత పూర్తయింది, టాకీ పార్ట్ ఎప్పుడవుతుంది.. సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం కేజీఎఫ్-చాప్టర్ 2 మీదే ఉంది. వచ్చే శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజు సలార్ టీజర్ లాంచ్ అవుతుందంటూ ఇప్పుడు గట్టి ప్రచారం జరుగుతుండటం విశేషం. దీని గురించి బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు బయటికి రావడం విశేషం. కేజీఎఫ్-2 సినిమా ఇంటర్వెల్లో సలార్ టీజర్ను ప్రదర్శిస్తారని.. ఈ సినిమా ప్రింట్లతో పాటు సలార్ టీజర్ను ఎటాచ్ చేస్తున్నారని.. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇస్తున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా సలార్ ట్రెండ్ అయిపోతోంది. ప్రభాస్ అభిమానులు ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా సలార్ నుంచి ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఫస్ట్ లుక్కే రిలీజ్ కాలేదు. కేజీఎఫ్-2 ప్రమోషన్ల మీద దృష్టిపెట్టిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ టీజర్ పని పెట్టుకుంటాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయినా ఇంత పెద్ద సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారంటే ముందు కొంచెం ప్రమోషనల్ హంగామా ఉండాలి. ఇప్పటిదాకా అయితే అలాంటిదేమీ కనిపించడం లేదు. మరి బాలీవుడ్ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కేజీఎఫ్-2 సినిమా మధ్యలో సలార్ టీజర్ ప్రదర్శితమవుతుందా అన్నది చూడాలి.
This post was last modified on April 8, 2022 8:50 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…