దాదాపు ఏడాదిన్నర కిందట ఇంకా షూటింగ్ మొదలు కాకముందే టైటిల్, ప్రి లుక్ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది సలార్ టీం. ఐతే ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ ముచ్చటా లేదు. సినిమా షూటింగ్ గురించి కూడా ఏ అప్డేట్ లేదు. చిత్రీకరణ ఎంత పూర్తయింది, టాకీ పార్ట్ ఎప్పుడవుతుంది.. సినిమా ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాలపై ఏ స్పష్టతా లేదు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం కేజీఎఫ్-చాప్టర్ 2 మీదే ఉంది. వచ్చే శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజు సలార్ టీజర్ లాంచ్ అవుతుందంటూ ఇప్పుడు గట్టి ప్రచారం జరుగుతుండటం విశేషం. దీని గురించి బాలీవుడ్ మీడియా నుంచి వార్తలు బయటికి రావడం విశేషం. కేజీఎఫ్-2 సినిమా ఇంటర్వెల్లో సలార్ టీజర్ను ప్రదర్శిస్తారని.. ఈ సినిమా ప్రింట్లతో పాటు సలార్ టీజర్ను ఎటాచ్ చేస్తున్నారని.. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లకు కూడా సమాచారం ఇస్తున్నారని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా సలార్ ట్రెండ్ అయిపోతోంది. ప్రభాస్ అభిమానులు ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా సలార్ నుంచి ప్రభాస్ ఫుల్ లెంగ్త్ ఫస్ట్ లుక్కే రిలీజ్ కాలేదు. కేజీఎఫ్-2 ప్రమోషన్ల మీద దృష్టిపెట్టిన ప్రశాంత్ ఇప్పుడు సలార్ టీజర్ పని పెట్టుకుంటాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
అయినా ఇంత పెద్ద సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్నారంటే ముందు కొంచెం ప్రమోషనల్ హంగామా ఉండాలి. ఇప్పటిదాకా అయితే అలాంటిదేమీ కనిపించడం లేదు. మరి బాలీవుడ్ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కేజీఎఫ్-2 సినిమా మధ్యలో సలార్ టీజర్ ప్రదర్శితమవుతుందా అన్నది చూడాలి.
This post was last modified on April 8, 2022 8:50 am
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…