తెలుగు సినిమాలు కన్నడనాట సంచలనం రేపడమే తప్ప.. కన్నడ సినిమాలు తెలుగులో వసూళ్ల మోత మోగించడం అరుదు. అప్పుడెప్పుడో ఉపేంద్ర నటించిన ఎ, ఉపేంద్ర లాంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి కానీ.. ఆ తర్వాత కన్నడ డబ్బింగ్ చిత్రాలేవీ కనీస ప్రభావం కూడా చూపింది లేదు. ఇలాంటి టైంలో మూడేళ్ల కిందట ‘కేజీఎఫ్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ట్రైలర్ చూస్తే మన ‘ఛత్రపతి’ లాంటి సినిమాలా కనిపించేసరికి మన వాళ్లు ముందు లైట్ తీసుకున్నారు కానీ.. టాక్ అదిరిపోవడంతో ఎగబడి ఈ సినిమా చూశారు.
మాస్, యాక్షన్ ప్రియులను ‘కేజీఎఫ్’ మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. థియేటర్లలో ఘన విజయాన్నందుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత ఓటీటీలో మరింతగా మన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించబోతోంది. వచ్చే శుక్రవారమే ‘కేజీఎఫ్-2’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ చూస్తే షాకవ్వక తప్పదు.
ఏపీ, తెలంగాణలో కలిపి వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన తొలి పర భాషా చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇప్పటిదాకా ‘2.0’ రూ.70 కోట్లతో రికార్డును కలిగి ఉంది. దాన్ని భారీ మార్జిన్తో ‘కేజీఎఫ్-2’ కొట్టేసింది. ఒక్క నైజాం ఏరియాకే ‘కేజీఎఫ్-2’ హక్కులు రూ.50 కోట్లు పలకడం విశేషం. రాజమౌళి సినిమాలు బాహుబలి-2, ఆర్ఆర్ఆర్కు మినహాయిస్తే తెలుగులో మరే చిత్రానికీ తెలుగులో నైజాం హక్కులు ఇంత రేటు పలకకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో సైతం ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. సీడెడ్ హక్కులు రూ.20 కోట్లకు, ఏపీలో మిగతా ఏరియాలన్నింటికీ కలిపి రైట్స్ 42 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మొత్తంగా ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. దీన్ని బట్టి సినిమా మీద ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్లో ఏ స్థాయిలో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 7, 2022 8:15 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…