తెలుగు సినిమాలు కన్నడనాట సంచలనం రేపడమే తప్ప.. కన్నడ సినిమాలు తెలుగులో వసూళ్ల మోత మోగించడం అరుదు. అప్పుడెప్పుడో ఉపేంద్ర నటించిన ఎ, ఉపేంద్ర లాంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి కానీ.. ఆ తర్వాత కన్నడ డబ్బింగ్ చిత్రాలేవీ కనీస ప్రభావం కూడా చూపింది లేదు. ఇలాంటి టైంలో మూడేళ్ల కిందట ‘కేజీఎఫ్’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ట్రైలర్ చూస్తే మన ‘ఛత్రపతి’ లాంటి సినిమాలా కనిపించేసరికి మన వాళ్లు ముందు లైట్ తీసుకున్నారు కానీ.. టాక్ అదిరిపోవడంతో ఎగబడి ఈ సినిమా చూశారు.
మాస్, యాక్షన్ ప్రియులను ‘కేజీఎఫ్’ మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. థియేటర్లలో ఘన విజయాన్నందుకున్న ఈ చిత్రం.. ఆ తర్వాత ఓటీటీలో మరింతగా మన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించబోతోంది. వచ్చే శుక్రవారమే ‘కేజీఎఫ్-2’ థియేటర్లలోకి దిగబోతోంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన బిజినెస్ చూస్తే షాకవ్వక తప్పదు.
ఏపీ, తెలంగాణలో కలిపి వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన తొలి పర భాషా చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది. ఇప్పటిదాకా ‘2.0’ రూ.70 కోట్లతో రికార్డును కలిగి ఉంది. దాన్ని భారీ మార్జిన్తో ‘కేజీఎఫ్-2’ కొట్టేసింది. ఒక్క నైజాం ఏరియాకే ‘కేజీఎఫ్-2’ హక్కులు రూ.50 కోట్లు పలకడం విశేషం. రాజమౌళి సినిమాలు బాహుబలి-2, ఆర్ఆర్ఆర్కు మినహాయిస్తే తెలుగులో మరే చిత్రానికీ తెలుగులో నైజాం హక్కులు ఇంత రేటు పలకకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో సైతం ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. సీడెడ్ హక్కులు రూ.20 కోట్లకు, ఏపీలో మిగతా ఏరియాలన్నింటికీ కలిపి రైట్స్ 42 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మొత్తంగా ‘కేజీఎఫ్-2’ తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్లకు పైగా బిజినెస్ చేయడం విశేషం. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. దీన్ని బట్టి సినిమా మీద ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్లో ఏ స్థాయిలో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on April 7, 2022 8:15 pm
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…