రామ్ గోపాల్ వర్మ సినిమాలను జనాలు లైట్ తీసుకోవడం మొదలై చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన సినిమాలు రిలీజవుతున్న సంగతి కూడా జనాలకు తెలియడం లేదు. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి తేలేని పరిస్థితి ఉంటోంది. ఒకప్పటి వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన పేరెత్తితే తల పట్టుకునే స్థితిలో ఉన్నారు. కంటెంట్ను కాకుండా కాంట్రవర్శీలను నమ్ముకుని కొన్నాళ్లు బండి లాగించిన వర్మకు.. ఇప్పుడు ఆ గిమ్మిక్కులు కూడా ఫలితాన్నివ్వడం లేదు.
ఆయన సినిమాలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. వర్మ చిత్రం అంటే కనీస స్థాయిలో కూడా బజ్ కనిపించని పరిస్థితుల్లో థియేటర్లు దొరకడం కూడా గగనం అయిపోతోంది. అందులోనూ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా ఇరగాడేస్తుండగా.. కొత్తగా గని అనే పేరున్న సినిమా రిలీజవుతుండగా.. ఖత్రా డేంజరస్ అనే ఏమాత్రం బజ్ లేని సినిమాను ప్రదర్శించడానికి ఎగ్జిబిటర్లు ఎక్కడ ముందుకు వస్తారు?
సింగిల్ స్క్రీన్లు అస్సలు ఇచ్చే పరిస్థితి కనిపించకపోగా.. మల్టీప్లెక్సులు సైతం వెనుకంజే వేస్తున్నాయి. ఈ నెల 8న రిలీజ్ అంటే.. హైదరాబాద్లో ఈ సినిమాకు ఒక్క షోకు కూడా కేటాయించలేదు. థియేటర్లు కేటాయించడం డిమాండ్ మేరకే ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లతో వీర లెవెల్లో ఎక్స్పోజింగ్ చేయించి, ఇంటిమేట్ సీన్లు పెట్టినా సోషల్ మీడియాలో కూడా ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు.
ప్రేక్షకుల్లో అసలేమాత్రం ఈ సినిమా పట్ల ఆసక్తి లేదు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు దొరకడం కష్టమైనట్లుంది. ఐతే పీవీఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్సులు ఇది లెస్బియన్ ఫిలిం కావడంతో ప్రదర్శనకు అనుమతి ఇవ్వట్లేదని, ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీ హక్కులను కాలరాయడమే అంటూ వర్మ ట్విట్టర్లో కాంట్రవర్శీ క్రియేట్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ వర్మను లైట్ తీసుకున్న జనాలకు ఇదేమీ పట్టట్లేదు. పరిస్థితి చూస్తుంటే ఎప్పట్లా వర్మ తనే సొంతంగా పెట్టుకున్న ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోక తప్పేలా లేదు.
This post was last modified on April 6, 2022 9:34 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…