విష్ణు విశాల్.. తమిళంలో మంచి పేరున్న హీరోనే. అతడి తండ్రి రమేష్ కుడవ్లా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఆయన డీజీపీ హోదాలో కూడా పని చేశారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విష్ణు విశాల్.. సినిమాల్లోకి అడుగు పెట్టి తన టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ముందాసపట్టై, జీవా, ఇండ్రు నేట్రు నాలై లాంటి మంచి హిట్లతో కథానాయకుడిగా ఒక స్థాయిని అందుకున్నాడు. అతను నిర్మాతగా కూడా మారి విజయాలందుకున్నాడు. ఇప్పటికే ‘అరణ్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగులోకి హీరోగా అడుగు పెట్టాడు.
అతడి భార్య జ్వాల గుత్తా తన పరపతినంతా ఉపయోగించి ఈ సినిమాకు తెలుగులో బాగానే ప్రమోషన్ చేయించింది. ఈ చిత్రానికి మంచి రిలీజ్ కూడా దక్కింది. ‘ఎఫ్ఐఆర్’ సినిమాకు తెలుగులో మాస్ రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిందే.తన సినిమా ‘ఖిలాడి’ రిలీజవుతున్న రోజే ‘ఎఫ్ఐఆర్’ విడుదలైనప్పటికీ.. ఆ చిత్రానికి రవితేజ సమర్పకుడిగా ఉండటం విశేషమే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కూడా పాల్గొని విష్ణు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఐతే వీరి బంధం ఈ ఒక్క సినిమాకు పరిమితం కాలేదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. విష్ణు కొత్త చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాను విష్ణుతో కలిసి రవితేజనే నిర్మించబోతున్నాడు. విష్ణుకిది 18వ సినిమా. దీని టైటిల్ను కూడా మంగళవారమే ప్రకటించారు. మట్టికుస్తీ అనే ఈ సినిమాకు చెల్లా అయ్యవు దర్శకుడు.
హీరోగా ఒక స్థాయిని అందుకున్నాక రవితేజ సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రానున్న సినిమాలో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు విష్ణు విశాల్తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అతను నందమూరి బాలకృష్ణతోనుూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 6, 2022 9:38 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…