విష్ణు విశాల్.. తమిళంలో మంచి పేరున్న హీరోనే. అతడి తండ్రి రమేష్ కుడవ్లా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఆయన డీజీపీ హోదాలో కూడా పని చేశారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విష్ణు విశాల్.. సినిమాల్లోకి అడుగు పెట్టి తన టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ముందాసపట్టై, జీవా, ఇండ్రు నేట్రు నాలై లాంటి మంచి హిట్లతో కథానాయకుడిగా ఒక స్థాయిని అందుకున్నాడు. అతను నిర్మాతగా కూడా మారి విజయాలందుకున్నాడు. ఇప్పటికే ‘అరణ్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగులోకి హీరోగా అడుగు పెట్టాడు.
అతడి భార్య జ్వాల గుత్తా తన పరపతినంతా ఉపయోగించి ఈ సినిమాకు తెలుగులో బాగానే ప్రమోషన్ చేయించింది. ఈ చిత్రానికి మంచి రిలీజ్ కూడా దక్కింది. ‘ఎఫ్ఐఆర్’ సినిమాకు తెలుగులో మాస్ రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిందే.తన సినిమా ‘ఖిలాడి’ రిలీజవుతున్న రోజే ‘ఎఫ్ఐఆర్’ విడుదలైనప్పటికీ.. ఆ చిత్రానికి రవితేజ సమర్పకుడిగా ఉండటం విశేషమే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కూడా పాల్గొని విష్ణు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఐతే వీరి బంధం ఈ ఒక్క సినిమాకు పరిమితం కాలేదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. విష్ణు కొత్త చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాను విష్ణుతో కలిసి రవితేజనే నిర్మించబోతున్నాడు. విష్ణుకిది 18వ సినిమా. దీని టైటిల్ను కూడా మంగళవారమే ప్రకటించారు. మట్టికుస్తీ అనే ఈ సినిమాకు చెల్లా అయ్యవు దర్శకుడు.
హీరోగా ఒక స్థాయిని అందుకున్నాక రవితేజ సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రానున్న సినిమాలో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు విష్ణు విశాల్తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అతను నందమూరి బాలకృష్ణతోనుూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 6, 2022 9:38 am
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…