విష్ణు విశాల్.. తమిళంలో మంచి పేరున్న హీరోనే. అతడి తండ్రి రమేష్ కుడవ్లా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఆయన డీజీపీ హోదాలో కూడా పని చేశారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విష్ణు విశాల్.. సినిమాల్లోకి అడుగు పెట్టి తన టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ముందాసపట్టై, జీవా, ఇండ్రు నేట్రు నాలై లాంటి మంచి హిట్లతో కథానాయకుడిగా ఒక స్థాయిని అందుకున్నాడు. అతను నిర్మాతగా కూడా మారి విజయాలందుకున్నాడు. ఇప్పటికే ‘అరణ్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగులోకి హీరోగా అడుగు పెట్టాడు.
అతడి భార్య జ్వాల గుత్తా తన పరపతినంతా ఉపయోగించి ఈ సినిమాకు తెలుగులో బాగానే ప్రమోషన్ చేయించింది. ఈ చిత్రానికి మంచి రిలీజ్ కూడా దక్కింది. ‘ఎఫ్ఐఆర్’ సినిమాకు తెలుగులో మాస్ రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిందే.తన సినిమా ‘ఖిలాడి’ రిలీజవుతున్న రోజే ‘ఎఫ్ఐఆర్’ విడుదలైనప్పటికీ.. ఆ చిత్రానికి రవితేజ సమర్పకుడిగా ఉండటం విశేషమే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కూడా పాల్గొని విష్ణు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఐతే వీరి బంధం ఈ ఒక్క సినిమాకు పరిమితం కాలేదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. విష్ణు కొత్త చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాను విష్ణుతో కలిసి రవితేజనే నిర్మించబోతున్నాడు. విష్ణుకిది 18వ సినిమా. దీని టైటిల్ను కూడా మంగళవారమే ప్రకటించారు. మట్టికుస్తీ అనే ఈ సినిమాకు చెల్లా అయ్యవు దర్శకుడు.
హీరోగా ఒక స్థాయిని అందుకున్నాక రవితేజ సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రానున్న సినిమాలో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు విష్ణు విశాల్తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అతను నందమూరి బాలకృష్ణతోనుూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 6, 2022 9:38 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…