విష్ణు విశాల్.. తమిళంలో మంచి పేరున్న హీరోనే. అతడి తండ్రి రమేష్ కుడవ్లా ఐపీఎస్ అధికారి కావడం విశేషం. ఆయన డీజీపీ హోదాలో కూడా పని చేశారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన విష్ణు విశాల్.. సినిమాల్లోకి అడుగు పెట్టి తన టాలెంట్ రుజువు చేసుకున్నాడు. ముందాసపట్టై, జీవా, ఇండ్రు నేట్రు నాలై లాంటి మంచి హిట్లతో కథానాయకుడిగా ఒక స్థాయిని అందుకున్నాడు. అతను నిర్మాతగా కూడా మారి విజయాలందుకున్నాడు. ఇప్పటికే ‘అరణ్య’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అతను.. ఇటీవల ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగులోకి హీరోగా అడుగు పెట్టాడు.
అతడి భార్య జ్వాల గుత్తా తన పరపతినంతా ఉపయోగించి ఈ సినిమాకు తెలుగులో బాగానే ప్రమోషన్ చేయించింది. ఈ చిత్రానికి మంచి రిలీజ్ కూడా దక్కింది. ‘ఎఫ్ఐఆర్’ సినిమాకు తెలుగులో మాస్ రాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం తెలిసిందే.తన సినిమా ‘ఖిలాడి’ రిలీజవుతున్న రోజే ‘ఎఫ్ఐఆర్’ విడుదలైనప్పటికీ.. ఆ చిత్రానికి రవితేజ సమర్పకుడిగా ఉండటం విశేషమే. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో కూడా పాల్గొని విష్ణు మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు మాస్ రాజా. ఐతే వీరి బంధం ఈ ఒక్క సినిమాకు పరిమితం కాలేదు.
ఇప్పుడు ఇద్దరూ కలిసి నటించబోతున్నారు. విష్ణు కొత్త చిత్రంలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాను విష్ణుతో కలిసి రవితేజనే నిర్మించబోతున్నాడు. విష్ణుకిది 18వ సినిమా. దీని టైటిల్ను కూడా మంగళవారమే ప్రకటించారు. మట్టికుస్తీ అనే ఈ సినిమాకు చెల్లా అయ్యవు దర్శకుడు.
హీరోగా ఒక స్థాయిని అందుకున్నాక రవితేజ సోలో హీరోగానే నటిస్తూ వచ్చాడు. ఐతే ఈ మధ్యే మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రానున్న సినిమాలో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు విష్ణు విశాల్తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అతను నందమూరి బాలకృష్ణతోనుూ స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలొస్తున్నాయి.
This post was last modified on April 6, 2022 9:38 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…