వక్కంతం వంశీ.. న్యూస్ రీడర్గా ప్రస్థానం ఆరంభించి, ఆ తర్వాత నటుడిగా అరంగేట్రం చేసి.. ఆపై రచయితగా మారి స్టార్ స్టేటస్ సంపాదించి.. చివరికి దర్శకుడిగా మారిన వ్యక్తి. ఐతే రచయితగా అంతగా పేరు లేని వాళ్లు కూడా దర్శకులుగా మారాక పెద్ద రేంజికి వెళ్లారు కానీ.. రైటర్గా తిరుగులేని ఇమేజ్ సంపాదించిన వక్కంతం వంశీ.. దర్శకుడిగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా మారాల్సిన అతను.. అనుకోకుండా ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడంతో ఇబ్బంది పడ్డాడు.
అయినా సరే అల్లు అర్జున్ లాంటి మరో పెద్ద హీరోతో దర్శకుడిగా తొలి చిత్రాన్ని ఓకే చేయించుకోగలిగాడు. కానీ వీరి కలయికలో వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంచనాలను అందుకోలేకపోయింది. తీసిపడేయదగ్గ సినిమా కాదు కానీ.. ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ‘నా పేరు సూర్య’ విఫలమైంది. తొలి సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం దర్శకత్వ ప్రయాణానికి పెద్ద బ్రేకే పడింది.
దాదాపు నాలుగేళ్లు సినిమా లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మధ్యలో కొన్ని కాంబినేషన్లు ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. చివరికి నితిన్తో ఓ సినిమా ఓకే అయిందని ఏడాది కిందట వార్తలొచ్చాయి. కానీ అది ఎంతకీ పట్టాలెక్కలేదు. ఇది కూడా వేరే చిత్రాల్లాగే క్యాన్సిల్ అవుతుందా అన్న అనుమానాలు కలిగాయి. ఐతే ఎట్టకేలకు వక్కంతం ప్రయత్నం ఫలించింది. నితిన్తో సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ఈ ఆదివారమే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.
ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది. ఇందులో నితిన్ సరసన ‘పెళ్ళిసందడి’ భామ శ్రీలీల నటించనుంది. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన హ్యారిస్ జైరాజ్ నితిన్-వంశీ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఈ మొత్తం కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేలాగే ఉంది. మరి ‘నా పేరు సూర్య’ భారాన్ని ఇంతకాలం మోసిన వక్కంతం.. దర్శకుడిగా తన రెండో సినిమాతో హిట్టు కొట్టి ఆ మరకలన్నీ పూర్తిగా చెరిపేస్తాడేమో చూడాలి.
This post was last modified on April 3, 2022 4:48 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…