విశ్వక్ సేన్.. ఈ పేరు టాలీవుడ్లో కొన్నేళ్లుగా హాట్ టాపిక్ మారింది. వెళ్ళిపోమాకే అనే చిన్న సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడతను. ఆ సినిమా రిలీజైన సంగతి కూడా చాలామందికి తెలియదు. అందులో చాలా అమాయకమైన కుర్రాడిగా కనిపించాడు విశ్వక్. ఆ తర్వాత అతను నటించిన ఈ నగరానికి ఏమైంది యూత్ను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాతో విశ్వక్లో కొత్త కోణం చూశారందరూ.
ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో నటించిన ఫలక్ నుమా దాస్ (మలయాళ అంగామలై డైరీస్కు రీమేక్)తో విశ్వక్ పేరు మార్మోగింది. ఆ సినిమా ప్రోమోలు ఒక సెన్సేషన్. దానికి తోడు విశ్వక్ బయట ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు, అతను చూపించిన యాటిట్యూడ్ కూడా సినిమాకు హైప్ను పెంచాయి. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయినా వసూళ్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత హిట్ మూవీతో ఇంకో హిట్ ఖాతాలో వేసుకున్నాడు విశ్వక్.
ఐతే వేదికల మీద మాట్లాడేటపుడు విశ్వక్ మరీ అతి చేస్తుంటాడని.. పబ్లిసిటీ కోసమే టూమచ్గా మాట్లాడుతుంటాడని తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. విజయ్ దేవరకొండను అనుకరించే ప్రయత్నంలో హద్దులు దాటిపోతుంటాడని కూడా కామెంట్లు పడుతుంటాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా విశ్వక్ తన స్టయిల్లో తాను వెళ్లిపోతుంటాడు.
సోషల్ మీడియాలో ఈ వ్యతిరేకత కూడా సినిమాల పబ్లిసిటీకి ఉపయోగపడుతుందనుకునే టైపు అతను. ఐతే ఈ నెగెటివిటీ ఎలా ఉన్నా, సక్సెస్ రేట్ మరీ గొప్పగా లేకపోయినా.. విశ్వక్కు ఛాన్సులకైతే లోటు లేదు. తాజాగా అతడి పుట్టిన రోజు సందర్భంగా ముఖచిత్రం అనే సినిమా టీజర్ వచ్చింది. దీంతో పాటు అతడి నుంచి రిలీజ్కు రెడీగా ఉన్న అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాల నుంచి బర్త్ డే విషెస్తో కొత్త పోస్టర్లు రిలీజయ్యాయి.
మరోవైపు గామి అనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇవి కాక కొత్తగా దమ్కీ అనే సినిమా మొదలు పెట్టాడు. ఇంకా ఫలక్ నుమా దాస్-2, స్టూడెంట్ అనే కొత్త సినిమాల్లో నటించనున్నట్లు కూడా అతను వెల్లడించాడు. యువ కథానాయకుల్లో ఇంత బిజీగా ఉన్న హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో.
This post was last modified on March 31, 2022 11:35 am
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఏ పెద్ద స్టార్ సినిమాకూ…
కియారా అద్వానీ.. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. అమ్మడు ఎలాంటి ఫోటోని పోస్ట్…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది.…
వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. మూసీ నది…
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు…