మూడు నెలల కిందట ‘అఖండ’ రిలీజ్ టైంలో #Boycottbollywood అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవడం చర్చనీయాంశం అయింది. ఈ హ్యాష్ ట్యాగ్ చూసి సౌత్ వాళ్లే బాలీవుడ్కు వ్యతిరేకంగా ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు వేస్తున్నారని అనుకున్నారు చాలామంది. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసింది, దాని మీద వేలల్లో ట్వీట్లు వేసింది ఉత్తరాది జనాలే.
ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్ ఫిలిం మేకర్స్.. హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ, వివాదాస్పద సన్నివేశాలతో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ‘పీకే’, ‘లుడో’ లాంటి సినిమాల్లో.. ‘తాండవ్’ లాంటి వెబ్ సిరీస్ల్లో హిందూ దేవుళ్ల, సంప్రదాయాలను కించపరిచేలా సన్నివేశాలు పెట్టడంపై గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాలీవుడ్ తీరు ఇలా ఉంటే.. దక్షిణాది చిత్రాల్లో హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను గొప్పగా చూపిస్తున్నాని నార్త్ ఇండియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘అఖండ’ సినిమాలో బాలయ్య చేసిన పాత్ర వారికి విపరీతంగా నచ్చేసింది. అందులో హిందూ దేవుళ్లు, ఆలయాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి గొప్పగా చెప్పడం.. క్లైమాక్స్లో శివతాండవాన్ని కళ్లు చెదిరేలా చూపించడం పట్ల అక్కడి జనాలు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ పాత్రలో వారు రాముడిని చూసుకున్నారు.
దీంతో పాటు బాహుబలి సహా పలు చిత్రాల్లో హిందూ దేవుళ్లను గొప్పగా చూపించడాన్ని వాళ్లు కొనియాడుతూ.. అదే సమయంలో ఇందుకు భిన్నంగా సినిమాలు తీసే హిందీ ఫిలిం మేకర్స్ను తప్పుబడుతూ బాలీవుడ్కు వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు నార్త్ నెటిజన్లు. ఆమిర్ ఖాన్ సహా పలువురు హీరోల తీరును ఈ సందర్భంగా దుయ్యపడుతున్నారు. తాజాగా రణబీర్ కపూర్, ఆలియా కలిసి ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్ కోసం హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతుండటాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on March 30, 2022 11:08 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…