Movie News

పూరి డ్రీమ్ ప్రాజెక్టులో అతడికేం పని?

జనగణమన.. దాదాపు దశాబ్దం నుంచి చర్చల్లో ఉన్న సినిమా. టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా ఈ పేరుతో సినిమా తీయాలని ఆశించారు. ‘బిజినెస్ మేన్’ తర్వాత రావాల్సిన ఈ సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు. ఒక దశలో ఆసక్తిగానే ఉన్న మహేష్.. ఆ తర్వాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడమే అందుక్కారణం. చేస్తే మహేష్‌తోనే చేయాలని, లేదంటే వద్దని పూరి ఒక దశలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

ఐతే తనతో విజయ్ దేవరకొండ ‘లైగర్’ చేశాక.. అతడితో తన డ్రీమ్ ప్రాజెక్టును చేయొచ్చని పూరికి నమ్మకం కుదిరింది. విజయ్ కూడా ఓకే అనడంతో ఈ సినిమాకు చకచకా సన్నాహాలు జరిగిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు వార్తలొచ్చాయి. కాకపోతే ఇంకా దీని గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఆ తంతు కూడా పూర్తయింది.‘జేజీఎమ్’ అంటూ షార్ట్ నేమ్‌తో సినిమాను అనౌన్స్ చేసింది చిత్ర బృందం.

ఇది యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా అన్నట్లుగా ప్రి లుక్ డిజైన్ చేశాడు పూరి. అది ఆసక్తికరంగానే అనిపిస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్ రోజే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడం విశేషం. 2023 ఏప్రిల్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘లైగర్’ లాగే ఇది కూడా పాన్ ఇండియా సినిమానే కావడం విశేషం. ఇందులో బాలీవుడ్ భామ జాన్వి కపూర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. పూరి గత సినిమాల్లాగే ఈ చిత్రంలోనూ ఆయనతో పాటు ఛార్మి నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు.

వీరికి ఇంకో వ్యక్తి కూడా తోడయ్యారు. అది దర్శకుడు వంశీ పైడిపల్లి కావడమే ట్విస్ట్. పాన్ ఇండియా సినిమా అంటే.. ఏ కరణ్ జోహార్ లాంటి వాళ్లనో భాగస్వాములుగా చేర్చుకుంటారని అనుకున్నారు కానీ.. ఆశ్చర్యకరంగా వంశీ లైన్లోకి వచ్చాడు. పూరితో కానీ, విజయ్‌తో కానీ అతడికి వేరే కనెక్షన్లేమీ లేవు. వీరితో అతనెప్పుడూ కలిసి పని చేసింది లేదు. ఇప్పటిదాకా వంశీ నిర్మాతగా సినిమా చేసిందీ లేదు. మరి పర్టికులర్‌గా ఈ సినిమాలో అతను భాగస్వామి కావడమేంటో అర్థం కావడం లేదు. దీని వెనుక మర్మమేంటో చిత్ర బృందమే చెప్పాలి.

This post was last modified on March 29, 2022 8:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

47 minutes ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

2 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

4 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

4 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago