కరోనా భయం వెంటాడుతున్నా.. లాక్ డౌన్ షరతులు కొనసాగుతున్నా.. టాలీవుడ్లో పెళ్లి సందడి ఏమీ ఆగట్లేదు. కొన్నాళ్లు వేచి చూసి, ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ముందుగా దిల్ రాజు తన రెండో పెళ్లితో సినీ జనాల్లో భయాన్ని కొంచెం తగ్గించారు. ఆ తర్వాత నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కాడు. ఇంకో నెలన్నరలో దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్ల పెళ్లి కూడా జరగబోతోంది. ఆపై నితిన్ పెళ్లికి కూడా డేట్ ఫిక్సయ్యే అవకాశముంది. ఈలోపు కొత్తగా కొణిదెల నిహారిక కూడా పెళ్లి రేసులోకి వచ్చింది.
త్వరలోనే నిహారిక పెళ్లి చేయబోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించిన నాగబాబు.. సంబంధం కుదిర్చేశారు. గుంటూరుకు చెందిన చైతన్య జొన్నలగడ్డను నిహారిక పెళ్లి చేసుకోబోతోంది. చైతన్య తాతతో చిరంజీవి తండ్రి వెంకట్రావుకు మంచి స్నేహం ఉందని.. ఇరు కుటుంబాల మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉందని.. ఈ నేపథ్యంలోనే సంబంధం కుదిరిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. నిహారిక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో. అందుకు అవకాశం లేదన్నది సన్నిహిత వర్గాల సమాచారం. నిహారిక సినిమాల్లోకి రావడమే కొంచెం కష్టంగా జరిగింది. నాన్న, పెదనాన్న సహా అందరినీ కష్టపడి ఒప్పించి తెరంగేట్రం చేసిందామె. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె కథానాయికగా సక్సెస్ కాలేదు.
మూడు సినిమాలు చేస్తే మూడు డిజాస్టర్లే అయ్యాయి. తమిళంలో నటించిన ఓ సినిమా కూడా తుస్సుమంది. ఎంత ఫ్యామిలీ బ్యాకప్ ఉన్నా కూడా.. వరుసగా ఫెయిల్యూర్లు వస్తే కెరీర్ ముందుకు సాగడం కష్టం. ఇప్పటికే నిహారిక తెలుగులో ఏ సినిమా చేయట్లేదు. తమిళంలో మాత్రం అశోక్ సెల్వన్ సరసన ఓ సినిమా ఒప్పుకుంది. షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక ఆ సినిమాను పూర్తి చేసి పెళ్లి పీటలు ఎక్కేయనుంది నిహారిక.
సరదాగా వెబ్ సిరీస్ల్లాంటివేమైనా చేస్తే చెయ్యొచ్చు కానీ.. పెళ్లి తర్వాత నిహారిక సినిమాలు చేయడం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. హీరోయిన్గా సక్సెస్ అయి ఉన్నా భవిష్యత్తులో సినిమాలు చేయడం గురించి ఆలోచించేదేమో కానీ.. ఎలాగూ ఫెయిల్యూరే కాబట్టి ఆమె ఆ దిశగా ఆలోచించదనే అంటున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…