ఒక ప్రక్కన స్వయంగా ఆ సినిమా తీసేవాళ్ళే మేము పలానా టైపు కథ చేస్తున్నాం అని చెబుతుంటారు. ఇంకో ప్రక్కన మాత్రం వాళ్లు తీసేది అది కాదు ఇది అంటూ చాలా రూమర్లు వస్తుంటాయ్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ దిగ్గజదర్శకుడు రాజమౌళి డైరక్షన్లో చేయబోయే తదుపరి సినిమా పరిస్థితి అలానే ఉంది. ఈ రూమర్లన్నీ విన్నాక ఇంతకీ ఈ సినిమా కథేంటో రాజమౌళికైనా తెలుసా అనే సందేహం రాకుండా ఉండదు. పదండి ఆ కథా కమామిషు ఏంటో చూద్దాం.
మొన్నామధ్యన ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో భాగంగా.. మహేష్ సినిమా మల్టీ స్టారర్ కాదంటూ రాజమౌళి.. అలాగే ఈ సినిమాను ఆఫ్రికన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాం అంటూ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కన్ఫామ్ చేశారు. వీళ్లు ఆ క్లారిటీ ఇచ్చి ఓ వారం అయ్యిందో లేదో.. అదిగో రాజమౌళి మహేష్ బాబుతో చేసేది జేమ్స్ బాండ్ సినిమా అని, ఈ సినిమా బడ్జెట్ 800 కోట్లు అంటూ రూమర్లు చెక్కర్లు కొట్టిస్తున్నారు. నిజానికి 800 కోట్లు బడ్జెట్ అనేది కేవలం ఫ్యాన్స్ కోసం చెబుతున్న పులిహోర అని అందరికీ అర్దమవుతోంది.
టాలీవుడ్ బయట ఇప్పటివరకు మహేష్ కు మార్కెట్ లేదు. ఇక ఆర్.ఆర్.ఆర్.లో ఇద్దరు హీరోలను పెట్టినాకాని ఒక వెయ్యి కోట్లు వస్తుందో రాదో అనే డౌట్ ఇంకా ఉంది. కనీసం ఆర్.ఆర్.ఆర్. ఫైనల్ బాక్సాఫీస్ కలక్షన్లు కూడా రాకముందే ఇలా మహేష్ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడటం కాస్త అతే అనిపిస్తుంది.
ఇకపోతే జేమ్స్ బాండ్ సినిమా కథల్లో హుమన్ ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మరి రిలేషన్స్ అండ్ ఎమోషన్స్ అనేవి లేకుండా అస్సలు సినిమాయే టచ్ చెయ్యని రాజమౌళి.. మహేష్ తో ఒక స్పై థ్రిల్లర్ చేస్తాడా అనేది ఇక్కడ ఆలోంచించాల్సిన విషయం. ఆఫ్రికన్ అడవుల్లో కథంటే.. ఖచ్చితంగా స్పై థ్రిల్లర్ అయ్యుండదు. ఏదన్నా కౌబాయ్ తరహా సినిమానో లేదంటే ఇండియా నుండి అక్కడికెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తరహా కథాంశమో కూడా అయ్యే ఛాన్సుంది. అయినా సినిమా ప్రకటించే ముందు తను తియ్యబోయే కతేంటో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టేసి మరీ చెబుతాడు. కాబట్టి ఇలా కథ గురించి బడ్జెట్ గురించి ఇప్పుడు అనవసరమైన రూమర్లు పుట్టించాల్సిన అవసరం లేదేమో!!
This post was last modified on March 29, 2022 5:08 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…