మిషన్ ఇంపాజిబుల్.. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిన్న చిత్రం. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనే అనుకున్నారు. ప్రభుత్వ రివార్డ్ కోసం దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు చిన్న పిల్లోళ్లు సాహసం చేసే నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ పాయింటే ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ట్రైలర్లో మిగతా అంశాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ఆశ్చర్యపరిచిన యువ దర్శకుడు స్వరూప్ నుంచి వస్తున్న కొత్త సినిమా కావడంతో ఇది కొత్తగా ఉంటుందని, మంచి వినోదాన్ని అందిస్తుందని ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. కాకపోతే ఈ సినిమాకు సరైన రిలీజ్ డేటే కుదరలేదు. వేసవి మొత్తం ప్యాక్ అయిపోయి ఉండగా.. భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి వారంలో రావడానికి వేరే చిత్రాలు భయపడుతున్న సమయంలో ఈ చిత్రానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఐతే ఇది ప్లస్సో మైనస్సో అర్థం కాని పరిస్థితి నెలకొంది.కొత్తగా వేరే సినిమాలేవీ పోటీలో లేకపోవడం ‘మిషన్ ఇంపాజిబుల్’కు కలిసొచ్చే విషయమే. కానీ కొత్త సినిమాలు లేకున్నా ముందు వారం రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ తాకిడిని తట్టుకోవడం ఈ చిన్న సినిమాకు తేలిక కాదు. ‘ఆర్ఆర్ఆర్’ ఊపు చూస్తుంటే.. రెండో వీకెండ్లో కూడా వసూళ్ల మోత మోగించేలా ఉంది. మెజారిటీ స్క్రీన్లలో ఆ సినిమాను కొనసాగించబోతున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’కు ఓ మోస్తరు సంఖ్యకు మించి స్క్రీన్లు దక్కకపోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాను ప్రదర్శించడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఐతే ఈ సినిమా స్థాయికి ఎన్ని స్క్రీన్లు దక్కాయన్నది ముఖ్యం కాదు.
సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చింది అందుబాటులో ఉన్న స్క్రీన్లలో ఎంత ఆక్యుపెన్సీ వచ్చింది అన్నది కీలకం. చూస్తుంటే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరిస్తారనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే టికెట్ల రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మంచి టాక్ వస్తే యువత, కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించే అవకాశముంది. చూద్దాం మరి ఈ చిన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ పోటీని తట్టుకుని ఏమాత్రం నిలబడుతుందో?
This post was last modified on March 29, 2022 1:21 pm
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…