మిషన్ ఇంపాజిబుల్.. ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిన్న చిత్రం. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనే అనుకున్నారు. ప్రభుత్వ రివార్డ్ కోసం దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు చిన్న పిల్లోళ్లు సాహసం చేసే నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ పాయింటే ట్రైలర్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ట్రైలర్లో మిగతా అంశాలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ఆశ్చర్యపరిచిన యువ దర్శకుడు స్వరూప్ నుంచి వస్తున్న కొత్త సినిమా కావడంతో ఇది కొత్తగా ఉంటుందని, మంచి వినోదాన్ని అందిస్తుందని ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. కాకపోతే ఈ సినిమాకు సరైన రిలీజ్ డేటే కుదరలేదు. వేసవి మొత్తం ప్యాక్ అయిపోయి ఉండగా.. భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ తర్వాతి వారంలో రావడానికి వేరే చిత్రాలు భయపడుతున్న సమయంలో ఈ చిత్రానికి డేట్ ఫిక్స్ చేశారు.
ఐతే ఇది ప్లస్సో మైనస్సో అర్థం కాని పరిస్థితి నెలకొంది.కొత్తగా వేరే సినిమాలేవీ పోటీలో లేకపోవడం ‘మిషన్ ఇంపాజిబుల్’కు కలిసొచ్చే విషయమే. కానీ కొత్త సినిమాలు లేకున్నా ముందు వారం రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ తాకిడిని తట్టుకోవడం ఈ చిన్న సినిమాకు తేలిక కాదు. ‘ఆర్ఆర్ఆర్’ ఊపు చూస్తుంటే.. రెండో వీకెండ్లో కూడా వసూళ్ల మోత మోగించేలా ఉంది. మెజారిటీ స్క్రీన్లలో ఆ సినిమాను కొనసాగించబోతున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’కు ఓ మోస్తరు సంఖ్యకు మించి స్క్రీన్లు దక్కకపోవచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు ఈ సినిమాను ప్రదర్శించడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఐతే ఈ సినిమా స్థాయికి ఎన్ని స్క్రీన్లు దక్కాయన్నది ముఖ్యం కాదు.
సినిమాకు ఎంత మంచి టాక్ వచ్చింది అందుబాటులో ఉన్న స్క్రీన్లలో ఎంత ఆక్యుపెన్సీ వచ్చింది అన్నది కీలకం. చూస్తుంటే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరిస్తారనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే టికెట్ల రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి మంచి టాక్ వస్తే యువత, కొంతమేర ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించే అవకాశముంది. చూద్దాం మరి ఈ చిన్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’ పోటీని తట్టుకుని ఏమాత్రం నిలబడుతుందో?
This post was last modified on March 29, 2022 1:21 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…