పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ను విస్తరించడానికి ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లందరూ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలకు విశేష ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో మన సూపర్ స్టార్లందరూ ఇండియా అంతటా తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఆల్రెడీ ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అర్జున్ ‘పుష్ప’తో నేషనల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం ఇలాంటి ఇమేజే సంపాదిస్తారని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ హీరోల్లా పవన్ కళ్యాణ్కు సరైన ప్లానింగ్ లేని మాట వాస్తవం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమోషన్ లేకుండా తన సినిమాలను హిందీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
ఇంతకుముందు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి పేలవమైన చిత్రాన్ని హిందీలో సరైన ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేశాడు. దానికి రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు. ఇప్పుడేమో ‘భీమ్లా నాయక్’ లాంటి రీమేక్ మూవీని అక్కడి తీసుకెళ్లాలని చూశాడు. దీని విషయంలోనూ ప్లానింగ్, ప్రమోషన్ లేకపోయింది. ముందు తెలుగు వెర్షన్తో పాటే హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కుదరలేదు. తర్వాతేమో ముందు తెలుగు వెర్షన్ను ఇక్కడ రిలీజ్ చేసేసి.. రెండు వారాల గ్యాప్లో హిందీ రిలీజ్ అనుకున్నారు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రన్ ముగిశాక వేరుగా హిందీ ట్రైలర్ వదిలారు. రిలీజ్కు సన్నాహాలు చేశారు.
కానీ ఏం జరిగిందో ఏమో.. అనుకున్న సమయానికి హిందీలో రిలీజ్ చేయలేకపోయారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రభంజనం సాగుతుండగా.. ‘భీమ్లా నాయక్’ను ఏం పట్టించుకుంటారని వెనక్కి తగ్గారో ఏమో తెలియదు. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ హంగామా మొదలైంది. ఈ చిత్రం ఉండగా ఇంకో సౌత్ మూవీని ఆదరించే అవకాశమే లేదు. ఓటీటీలో ‘భీమ్లా నాయక్’ అందుబాటులోకి వచ్చేస్తుండటంతో ఇక హిందీ వెర్షన్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిచిపోవాల్సిందేనేమో. వేరే స్టార్లంతా పాన్ ఇండియా హీరోలుగా ఎదిగిపోతుంటే.. పవన్ సినిమాలకు హిందీలో ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవడం అభిమానులకు రుచించడం లేదు.
This post was last modified on March 23, 2022 6:48 pm
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…