సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, జోక్స్ను సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరనే అనుకుంటారు చాలామంది. వాళ్లుండే బిజీకి తోడు మీమ్స్లో తమ మీద వేసే పంచులను తట్టుకోలేరనే భావిస్తారు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు అప్ టు డేట్గా ఉండాలంటే సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉండాలి. అందులో మీమ్స్, జోకులను ఫాలో అవుతూ ఉండాలి.
సెలబ్రెటీలకంంటూ ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా ఏమీ ఉండదు కాబట్టి, వాళ్లు కూడా మన లాంటి మనుషులే కాబట్టి ఫన్ కోసం సోషల్ మీడియాను, అందులో వచ్చే మీమ్స్ను అనుసరించక తప్పదు. ఈ విషయంలో మిగతా హీరోల కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా ముందున్నాడని.. సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకోవడంలో అతనికి అతనే సాటి అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలో తారక్ వివిధ చిత్రాల్లోని పాపులర్ డైలాగులను గుర్తు చేస్తూ సమయోచితంగా వేసిన పంచులు హైలైట్. ‘వెంకీ’ సినిమాలో మాస్టర్ భరత్ చెప్పే ‘నాకు ఆ కూల్ డ్రింకే కావాలి’.. ‘నేనింతే’ మూవీలో రవితేజ చెప్పిన ‘ఏంటి సార్ అది’.. ఇంకా కింగ్ మూవీలో ‘ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది’.. ‘ఐయామ్ టెల్లింగ్ దట్’.. ఇంకా లేటెస్ట్ హిట్ ‘డీజే టిల్లు’లోని ‘అట్లుంటది మనతోని’… ఈ డైలాగులన్నింటినీ అనుకరిస్తూ సమయానుకూలంగా అదిరిపోయే పంచులు వేశాడు తారక్.
మామూలుగా మీమర్స్ ఇలాంటి పంచ్ డైలాగుల్ని తీసుకుని మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ల కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో యువత కూడా ఇదే టైమింగ్తో కామెడీ పండిస్తుంటుంది. ఐతే ఎన్టీఆర్ స్థాయి హీరో కూడా మామూలు కుర్రాళ్ల లాగే ఆలోచిస్తూ మీమర్స్ తరహాలో పంచ్ డైలాగులు పేల్చుతూ ఇంటర్వ్యూల్లో కామెడీ పండించడం ఇక్కడ విశేషమే. ఈ నేపథ్యంలో అన్న కూడా మనలాంటోడేరా అంటూ ఇంటర్వ్యూల్లో తారక్ పంచ్ డైలాగులతో ఒక వీడియో రూపొందించి.. జూనియర్ రాముడికి డెడికేట్ చేశారు మీమర్స్.
This post was last modified on March 22, 2022 9:16 pm
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…