సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, జోక్స్ను సెలబ్రెటీలు పెద్దగా పట్టించుకోరనే అనుకుంటారు చాలామంది. వాళ్లుండే బిజీకి తోడు మీమ్స్లో తమ మీద వేసే పంచులను తట్టుకోలేరనే భావిస్తారు. కానీ మారుతున్న కాలానికి తగ్గట్లు అప్ టు డేట్గా ఉండాలంటే సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉండాలి. అందులో మీమ్స్, జోకులను ఫాలో అవుతూ ఉండాలి.
సెలబ్రెటీలకంంటూ ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా ఏమీ ఉండదు కాబట్టి, వాళ్లు కూడా మన లాంటి మనుషులే కాబట్టి ఫన్ కోసం సోషల్ మీడియాను, అందులో వచ్చే మీమ్స్ను అనుసరించక తప్పదు. ఈ విషయంలో మిగతా హీరోల కంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా ముందున్నాడని.. సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకోవడంలో అతనికి అతనే సాటి అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి పాల్గొన్న అనేక ఇంటర్వ్యూలో తారక్ వివిధ చిత్రాల్లోని పాపులర్ డైలాగులను గుర్తు చేస్తూ సమయోచితంగా వేసిన పంచులు హైలైట్. ‘వెంకీ’ సినిమాలో మాస్టర్ భరత్ చెప్పే ‘నాకు ఆ కూల్ డ్రింకే కావాలి’.. ‘నేనింతే’ మూవీలో రవితేజ చెప్పిన ‘ఏంటి సార్ అది’.. ఇంకా కింగ్ మూవీలో ‘ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది’.. ‘ఐయామ్ టెల్లింగ్ దట్’.. ఇంకా లేటెస్ట్ హిట్ ‘డీజే టిల్లు’లోని ‘అట్లుంటది మనతోని’… ఈ డైలాగులన్నింటినీ అనుకరిస్తూ సమయానుకూలంగా అదిరిపోయే పంచులు వేశాడు తారక్.
మామూలుగా మీమర్స్ ఇలాంటి పంచ్ డైలాగుల్ని తీసుకుని మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. వాళ్ల కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో యువత కూడా ఇదే టైమింగ్తో కామెడీ పండిస్తుంటుంది. ఐతే ఎన్టీఆర్ స్థాయి హీరో కూడా మామూలు కుర్రాళ్ల లాగే ఆలోచిస్తూ మీమర్స్ తరహాలో పంచ్ డైలాగులు పేల్చుతూ ఇంటర్వ్యూల్లో కామెడీ పండించడం ఇక్కడ విశేషమే. ఈ నేపథ్యంలో అన్న కూడా మనలాంటోడేరా అంటూ ఇంటర్వ్యూల్లో తారక్ పంచ్ డైలాగులతో ఒక వీడియో రూపొందించి.. జూనియర్ రాముడికి డెడికేట్ చేశారు మీమర్స్.
This post was last modified on March 22, 2022 9:16 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…