పెద్ద హీరోలు నటించిన కొత్త సినిమాలు రిలీజైనపుడు థియేటర్ల ముందు, లోపల అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఐతే ఈ హంగామా కొన్నిసార్లు మరీ శ్రుతి మించిపోతుంటుంది. సీట్లు విరిగిపోతుంటాయి. స్క్రీన్లు కూడా చిరిగిపోతుంటాయి. రాను రాను ఈ కల్చర్ మరీ ఎక్కువైపోయి.. స్క్రీన్ ముందు డయాస్ మీదికి పదుల సంఖ్యలో అభిమానులు వెళ్లి తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వెళ్తుండటంతో విధ్వంసాలు జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్న థియేటర్లు అప్రమత్తం అవుతున్నాయి. అభిమానులు హద్దులు దాటడానికి వీల్లేకుండా థియేటర్ల లోపల పొలాల చుట్టూ వేసే తరహా కంచెలు ఏర్పాటు చేయడం, అలాగే డయాస్ మీద మేకులు అమర్చిన చెక్కల్ని సెట్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
థియేటర్ల లోపల ఇలాంటి ఏర్పాట్లూ నభూతో అనే చెప్పాలి. మామూలుగా ఒక పెద్ద హీరో సినిమా అంటేనే థియేటర్లలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. పైగా ఆర్ఆర్ఆర్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్లు నటించారు. పైగా ఇది రాజమౌళి సినిమా. దీనిపై అంచనాలు మామూలుగా లేవు.
బయట తారక్, చరణ్ ఫ్యాన్స్ ఎవరికి వాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటడానికి ప్రయత్నిస్తున్న వైనం చూస్తున్నదే. అలాంటిది సినిమా రిలీజైనపుడు ఇరువురి అభిమానులు పోటాపోటీగా హడావుడి చేయడం గ్యారెంటీ. ఈ క్రమంలో థియేటర్లలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. అందుకే థియేటర్ల యాజమాన్యాలు ఇలాంటి జాగ్రత్తల్లో పడుతున్నట్లు అర్థమవుతోంది. విజయవాడ సహా ఏపీలో పలు థియేటర్లలో ఇలాంటి ఏర్పాట్లే జరుగుతున్నాయి.
This post was last modified on March 22, 2022 11:46 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…