Movie News

మూడేళ్ల తర్వాత ఫలితాలు.. విజేతగా విశాల్!

ఈ మధ్య టాలీవుడ్లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. గతంలో ‘మా’కు ఎన్నికలు జరుగుతుంటే  అసలు మీడియాలో చర్చే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇది సాధారణ ఎన్నికల స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనేక వివాదాలతో ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కాయి.

ఐతే ఈ ఒరవడి కేవలం తెలుగుకే పరిమితం కాదు. దీని కంటే ముందు తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు సైతం ఇదే స్థాయిలో వివాదాస్పదం అయ్యాయి. శరత్ కుమార్ నేతృత్వంలోని ప్యానెల్ మీద నాజర్-విశాల్-కార్తి ప్యానెల్ పోటీ చేసి గెలిచినపుడు ఆ ఎన్నికల గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ప్యానెల్ రెండేళ్ల వ్యవధిలో ఓ మోస్తరు పనితీరునే కనబరిచింది కానీ.. మరీ అద్భుతాలైతే చేయలేదు.

ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట జరిగిన తర్వాతి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.నాజర్ నాయకత్వంలో మరోసారి ఈ ప్యానెల్ పోటీకి దిగగా.. సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ నాయకత్వంలో శంకర్ దాస్ జట్టు వారికి ఎదురుగా పోటీ పడింది. ఐతే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శంకర్ దాస్ కోర్టుకు ఎక్కడంతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది. ఈ వ్యవహారం మూడేళ్లుగా కోర్టులోనే నానుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో ఈ కేసుకు ముగింపు పలికింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చని తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన మూడేళ్లు ఓట్ల లెక్కింపు చేపట్టారు. మళ్లీ నాజర్-విశాల్-కార్తిల ప్యానెలే భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘లాఠి’ సెట్స్‌లో విశాల్ అండ్ టీం విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఐతే ఎన్నికల ఫలితాల నిలుపుదలతో నడిగర్ సంఘంలో గత మూడేళ్లు పెద్దగా యాక్టివిటీ ఏమీ లేదు. నాజర్ అండ్ కో పదవీ కాలాన్ని ముందు నుంచి లెక్కించేట్లయితే ఇప్పటికే వాళ్ల టెర్మ్ పూర్తయినట్లవుతుంది. లేదంటే ఇక్కడి నుంచి కొత్తగా టర్మ్ మొదలవుతుంది.

This post was last modified on March 21, 2022 7:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మండలి చైర్మన్ పై అవివేశ్వాస తీర్మానం?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం శాస‌న మండ‌లి చైర్మ‌న్‌గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టే అంశంపై…

1 hour ago

బీఆర్ ఎస్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా?

తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియ‌ర్లు గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…

1 hour ago

కనకరాజు కాస్త త్వరగా రావొచ్చుగా

2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…

2 hours ago

శ్రీవిష్ణు అస్సలు తగ్గడం లేదు

ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…

4 hours ago

వైసీపీకి కొత్త పేరు పెట్టిన బాబు

టీడీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పారు. వైసీపీని గొడ్డ‌లి పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌..…

4 hours ago

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…

4 hours ago