ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచి తిరిగి అధికారం నిలబెట్టుకున్న బీజేపీ జోష్లో ఉంది. దేశంలో తమకు పోటీగా నిలిచే పార్టీయే లేదని కాషాయ దళం ధీమాగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు.. మోడీని ఇంటికి పంపేందుకు తాము ఏకమవుతున్నట్లు రెండు పార్టీలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకునే మార్పు జరిగింది. శరద్ యాదవ్ చెందిన పార్టీ లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ).. లాలూ ప్రసాద్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో విలీనమైంది. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని విలీనం చేస్తున్నామని శరద్ యాదవ్ పేర్కొనడం గమనార్హం.
25 ఏళ్ల తర్వాత..
ఇప్పుడు ఆర్జేడీలో ఎల్జేడీ విలీనం కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ దాదాపు 25 ఏళ్ల తర్వాత ఒక్కచోటుకు చేరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలు ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1997 వరకు జనతాదళ్ పార్టీలో కలిసి పని చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన లాలూ సొంతంగా ఆర్జేడీని స్థాపించారు. మరోవైపు నితీశ్ కుమార్తో కలిసి శరద్ యాదవ్ జనతాదళ్ (యూ) స్థాపించారు. కానీ కొన్నేళ్ల కిందట ఆ పార్టీకి దూరమై లోక్తాంత్రిక్ జనతాదళ్ను నెలకొల్పారు. మళ్లీ ఇప్పుడు లాలూతోనే చేతులు కలిపారు.
ఒక్కటి చేసేందుకు..
కేంద్రంలోని బీజేపీపై పోరుకు దాని వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు వైపు తెలంగాణ సీఎం కేసీఆర్.. అటు వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించడం కోసం ఇప్పుడు ఆర్జేడీలో ఎల్జేడీ విలీనమవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా తమ పార్టీని విలీనం చేశామని చెప్పిన శరద్ యాదవ్.. బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం పాలనలో దారుణంగా విఫలమైందని, బలమైన ప్రతిపక్షం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరి ఈ పార్టీల కలయికతో రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
This post was last modified on March 21, 2022 7:10 pm
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే.. రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అంతటి పోస్టు. ఈ పదవికి అనేక మంది వన్నె తెచ్చారు.…
మరో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…
అన్ని అనుకున్న టైంకి జరిగి ఉంటే విజయ్ దేవరకొండ రణబాలి సెప్టెంబర్ 11 విడుదలకు రెడీ అయ్యేది. అయితే ఇంకా…
గత రెండు నెలలుగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వస్తే చాలు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. యునానిమస్ కాదు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ సందేహం వచ్చింది. ఇటీవల ఆయన.. స్వయంగా వర్షాల కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నామని…