బాక్సాఫీస్ దగ్గర అప్పుడప్పుడూ కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి అద్భుతమే.. ది కశ్మీర్ ఫైల్స్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ అంత గొప్ప ట్రాక్ రికార్డేమీ లేని వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన చిత్రమిది. ఇందులో ఏమీ స్టార్లు లేరు. ఇదేమీ భారీ బడ్జెట్ సినిమా కాదు. ఒక ఊహాజనిత గాథతో తీసిన సినిమా కూడా కాదు. అసలిప్పటి నేపథ్యంలో నడిచే కథా కాదు.
కశ్మీర్లో 90వ దశకంలో హిందూ పండిట్ల మీద జరిగిన అఘాయిత్యాల నేపథ్యంలో వివేక్ ఈ సినిమాను రూపొందించాడు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత వారం పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది.
తొలి రోజు మూడు కోట్లకు అటు ఇటుగా వసూళ్లే సాధించిందీ సినిమా. అలాంటి చిత్రం.. వారాంతం అయ్యాక, వీక్ డేస్లో రోజుకు ఏడెనిమిది కోట్లకు తగ్గకుండా గ్రాస్ రాబడుతూ ఔరా అనిపిస్తోంది. స్క్రీన్లు పెరుగుతున్నాయి. షోలు పెరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ఉత్తరాదిన ఈ సినిమా ఇలా పుంజుకోవడంలో మరీ ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. కానీ దక్షిణాదిన హిందీ సినిమాాలు తక్కువగా చూసే ప్రాంతాల్లో కూడా ‘కశ్మీర్ ఫైల్స్’ వసూళ్ల మోత మోగిస్తోంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో అడ్వాన్స్ ఫుల్స్ పడుతున్నాయి. గత వారం భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ను వీకెండ్లోనే ఉత్తరాదిన ‘కశ్మీర్ ఫైల్స్’తో రీప్లేస్ చేశారు. ఇప్పుడు దేశమంతటా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో సైతం ‘రాధేశ్యామ్’ను తీసేసి ‘కశ్మీర్ ఫైల్స్’ను ఆడించే పరిస్థితి కనిపిస్తోంది. ఏముందీ సినిమాలో అని ప్రేక్షకులు ఎగబడి ఎగబడి చూస్తున్నారు. చిత్ర బృందం పెద్దగా పబ్లిసిటీ ఏమీ చేయకున్నా.. జనాలే అమితాసక్తితో సినిమా చూస్తున్నారు. హిందువుల మీద జరిగిన అఘాయిత్యాలపై తీసిన సినిమా కావడంతో బీజేపీ వాళ్లు దీన్ని ఓన్ చేసుకుని, తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటుండటం, పబ్లిసిటీ ఇస్తుండటం కూడా వాస్తవమే అయినప్పటికీ.. సామాన్య జనం ఈ సినిమాపై ఇంత ఆసక్తిని ప్రదర్శించడం మాత్రం విశేషమే. వారం వ్యవధిలో రూ.90 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఫుల్ రన్లో రూ.200 కోట్ల మార్కును అందుకునేలా ఉంది.
This post was last modified on March 18, 2022 4:50 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…