యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నెలలో కచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ఆ చిత్ర పీఆర్ వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. నిజానికి జూన్ 14నే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్తో పోస్టర్ రిలీజ్ చేయాల్సిందట.
ఐతే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో అందరూ విషాదంలో మునిగిపోయిన నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఇవ్వలేకపోయారు. కొంచెం గ్యాప్ తీసుకుని.. మరి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐతే ఈ లోపే బాలీవుడ్ మీడియాకు చిత్ర బృందం నుంచి కొంత సమాచారం వెళ్లింది. ఫస్ట్ లుక్ లాంచ్ ముంగిట హైప్ కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ పీఆర్వోలు వరుసబెట్టి ప్రభాస్ కొత్త సినిమా గురించి ట్వీట్లు వేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ వాయిదా పడిందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారైనట్లుగా వాళ్లు ట్వీట్లు వేస్తున్నారు. ఆ ట్వీట్లన్నీ ఒకే రకంగా ఉండటంతో చిత్ర బృందమే అక్కడి పీఆర్వోలకు హింట్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
ఇంతకుముందు ‘జాన్’ అనే ఓ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. దాని విషయంలో వెనక్కి తగ్గినట్లున్నారు. ఇప్పుడొస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ప్రేమకథకు ఈ టైటిల్ ఖరారైనట్లే అనిపిస్తోంది. కచ్చితంగా ఇంకో వారం లోపు ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇంకో 20 శాతం దాకా చిత్రీకరణ మిగిలున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.
This post was last modified on June 20, 2020 12:12 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…