Movie News

ప్రభాస్ కొత్త సినిమాపై నేషనల్ మీడియాకు లీక్స్

యంగ్ రెబల్ స్టార్ కొత్త సినిమా అప్ డేట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నెలలో కచ్చితంగా అప్ డేట్ ఉంటుందని ఆ చిత్ర పీఆర్ వర్గాలు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. నిజానికి జూన్ 14నే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పోస్టర్ రిలీజ్ చేయాల్సిందట.

ఐతే బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో అందరూ విషాదంలో మునిగిపోయిన నేపథ్యంలో ఈ పాన్ ఇండియా మూవీ అప్ డేట్ ఇవ్వలేకపోయారు. కొంచెం గ్యాప్ తీసుకుని.. మరి కొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐతే ఈ లోపే బాలీవుడ్ మీడియాకు చిత్ర బృందం నుంచి కొంత సమాచారం వెళ్లింది. ఫస్ట్ లుక్ లాంచ్ ముంగిట హైప్ కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ పీఆర్వోలు వరుసబెట్టి ప్రభాస్ కొత్త సినిమా గురించి ట్వీట్లు వేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ వాయిదా పడిందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారైనట్లుగా వాళ్లు ట్వీట్లు వేస్తున్నారు. ఆ ట్వీట్లన్నీ ఒకే రకంగా ఉండటంతో చిత్ర బృందమే అక్కడి పీఆర్వోలకు హింట్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

ఇంతకుముందు ‘జాన్’ అనే ఓ టైటిల్ ప్రచారంలో ఉంది కానీ.. దాని విషయంలో వెనక్కి తగ్గినట్లున్నారు. ఇప్పుడొస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ప్రేమకథకు ఈ టైటిల్ ఖరారైనట్లే అనిపిస్తోంది. కచ్చితంగా ఇంకో వారం లోపు ఫస్ట్ లుక్ లాంచ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. పూజా హెగ్డే కథానాయిక. ఇంకో 20 శాతం దాకా చిత్రీకరణ మిగిలున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలయ్యే అవకాశముంది.

This post was last modified on June 20, 2020 12:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

39 seconds ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

1 hour ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago