ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను కేవలం తెలుగు హీరోల్లా చూసే పరిస్థితి లేదు. ఒక్కొక్కరుగా తమ మార్కెట్ను విస్తరిస్తూ పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియా లెవెల్లో తాన ఫాలోయింగ్, మార్కెట్ను విస్తరించాడు. పుష్ప సినిమా అతడికి ఎక్కడలేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ల ఇమేజ్లు కూడా మారిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే.. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ను విస్తరించడంలో చాలా ప్రణాళికలతో అడుగులు వేసే అల్లు అర్జున్.. పుష్పతో వచ్చిన గుర్తింపును మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే అతను ముంబయిలో బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలిని కలవడం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం బన్నీ.. ముంబయిలోని బన్సాలి ఆఫీసులో కలిసి బయటికి వచ్చి కారెక్కుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఈ కలయిక సినిమా కోసమేనా.. మరో దాని కోసమా అన్న చర్చ నడుస్తోంది. పుష్ప-1, పుష్ప-2కు మధ్య బన్నీ వేరే సినిమా చేయాల్సింది కానీ.. తర్వాత అతడి ప్రణాళికలు మారిపోయాయి. ఐకాన్ మూవీని మొదలుపెట్టేలా కనిపించిన అతను.. దాన్ని పక్కన పెట్టేశాడు. తన ఫోకస్ మొత్తం పుష్ప-2 మీదికే మళ్లించినట్లు కనిపించాడు. మధ్యలో వేరే సినిమా చేస్తాడో లేదో తెలియదు కానీ.. పుష్ప-2 తర్వాత కూడా ఏ సినిమాకూ కమిట్ అయినట్లు సంకేతాలు కనిపించడం లేదు.
కొరటాల శివతో అనుకున్న సినిమా డోలాయమానంలో పడింది. పుష్ప-2తో పాన్ ఇండియా లెవెల్లో తన ఇమేజ్ ఇంకా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో.. బన్సాలీతో పాన్ ఇండియా సినిమా చేస్తే బాగుంటుందని చూస్తున్నాడేమో. బన్సాలీ కూడా సౌత్ హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తితోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్తో బన్సాలీ సినిమా ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి కానీ.. అది వర్కవుట్ కాలేదు. మరి బన్సాలీ-బన్నీ మూవీ అయినా ఓకే అవుతుందేమో చూడాలి.
This post was last modified on March 14, 2022 11:58 pm
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…
కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్…