బాహుబలి.. భారతీయ ప్రేక్షకులను ఈ చిత్రం చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంతకంటే గొప్ప సినిమాలు చాలా ఉండొచ్చు కానీ.. దీని రీచ్, ఇది సాధించిన వసూళ్లు, దీని చుట్టూ నెలకొన్న యుఫోరియాను మ్యాచ్ చేయడం మాత్రం మరే సినిమాకూ సాధ్యం కాదనే చెప్పాలి. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులనూ మెప్పించి అసలు సిసలైన ‘ఇండియన్ సినిమా’ అనిపించుకుంది బాహుబలి. ‘ది కంక్లూజన్’తోనే బాహుబలి సినిమా ముగిసినా.. ఆ ప్రపంచాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని ఇంతకుముందే చాటి చెప్పాడు జక్కన్న.
ఇక అప్పట్నుంచి ‘బాహుబలి-3’ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ తర్వాత ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో బిజీ అయిపోవడం.. ఆపై మహేష్ మూవీని లైన్లో పెట్టడం.. మరోవైపు ‘మహాభారతం’పై మెగా మూవీ ఆయన కోసం ఎదురు చూస్తుండటంతో ‘బాహుబలి-3’పై అంతా ఆశలు వదులుకున్నారు.కానీ ఇప్పుడు జక్కన్న మళ్లీ ‘బాహుబలి-3’ ఊసెత్తడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడారు. బాహుబలి-3 ఉంటుందా అని అడిగితే.. దీని చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నాయని.. బాహుబలి ప్రపంచాన్ని భిన్న కోణాల్లో కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇందులో భాగంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. కచ్చితంగా బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని.. త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ న్యూస్ బయటికి వస్తుందని జక్కన్న చెప్పాడు.
ఆయనీ మాట చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి-3 చర్చలు ఊపందుకున్నాయి. ఇందులోనూ ప్రభాసే నటిస్తాడా.. ఇంకెవరైనా లీడ్ రోల్ కోసం తీసుకుంటారా..బాహుబలి కథనే కొనసాగిస్తారా.. లేక అలాంటి నేపథ్యంలో మరో కథను తెరపైకి తెస్తారా అని అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on March 14, 2022 4:49 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…