బాహుబలి.. భారతీయ ప్రేక్షకులను ఈ చిత్రం చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంతకంటే గొప్ప సినిమాలు చాలా ఉండొచ్చు కానీ.. దీని రీచ్, ఇది సాధించిన వసూళ్లు, దీని చుట్టూ నెలకొన్న యుఫోరియాను మ్యాచ్ చేయడం మాత్రం మరే సినిమాకూ సాధ్యం కాదనే చెప్పాలి. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులనూ మెప్పించి అసలు సిసలైన ‘ఇండియన్ సినిమా’ అనిపించుకుంది బాహుబలి. ‘ది కంక్లూజన్’తోనే బాహుబలి సినిమా ముగిసినా.. ఆ ప్రపంచాన్ని కొనసాగించాలన్న ఉద్దేశాన్ని ఇంతకుముందే చాటి చెప్పాడు జక్కన్న.
ఇక అప్పట్నుంచి ‘బాహుబలి-3’ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ తర్వాత ఆయన ‘ఆర్ఆర్ఆర్’లో బిజీ అయిపోవడం.. ఆపై మహేష్ మూవీని లైన్లో పెట్టడం.. మరోవైపు ‘మహాభారతం’పై మెగా మూవీ ఆయన కోసం ఎదురు చూస్తుండటంతో ‘బాహుబలి-3’పై అంతా ఆశలు వదులుకున్నారు.కానీ ఇప్పుడు జక్కన్న మళ్లీ ‘బాహుబలి-3’ ఊసెత్తడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడారు. బాహుబలి-3 ఉంటుందా అని అడిగితే.. దీని చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నాయని.. బాహుబలి ప్రపంచాన్ని భిన్న కోణాల్లో కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇందులో భాగంగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. కచ్చితంగా బాహుబలి ప్రపంచం కొనసాగుతుందని.. త్వరలోనే ఒక ఎగ్జైటింగ్ న్యూస్ బయటికి వస్తుందని జక్కన్న చెప్పాడు.
ఆయనీ మాట చెప్పినప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి-3 చర్చలు ఊపందుకున్నాయి. ఇందులోనూ ప్రభాసే నటిస్తాడా.. ఇంకెవరైనా లీడ్ రోల్ కోసం తీసుకుంటారా..బాహుబలి కథనే కొనసాగిస్తారా.. లేక అలాంటి నేపథ్యంలో మరో కథను తెరపైకి తెస్తారా అని అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
This post was last modified on March 14, 2022 4:49 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…