ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. అసలే కరోనా దెబ్బకు అల్లాడిపోతే.. అది చాలదన్నట్లు టికెట్ల ధరలు తగ్గించి.. బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఆపి వేయించి థియేటర్ల వ్యవస్థను గట్టి దెబ్బే తీసింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఈ మధ్య రేట్లు కాస్త పెంచినా.. అదనపు షోలు, బెనిఫిట్ షోల విషయంలో మాత్రం పెద్దగా వెసులుబాటు ఇవ్వలేదు. ఐదో షోకు అనుమతి ఇచ్చినా.. దానికి వేరే మెలిక పెట్టారు.
ఐతే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఉన్న రేట్లను మించి టికెట్ల ధరలు పెంచడమే కాక.. ప్రతి పెద్ద సినిమాకూ రెండు వారాల వరకు అదనంగా రేట్లు పెంచుకునే అవకాశం కల్పించిన ఇక్కడి ప్రభుత్వం.. అదనపు షోల విషయంలోనూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. దాదాపుగా ప్రతి పెద్ద సినిమాకూ ఐదో షో వేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఐతే ఇప్పటిదాకా ఏ సినిమాకు ఆ సినిమాకు ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టుకుని అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటిదాకా. ఐతే ఇకపై ఆ అవసరం లేదు. ప్రతి థియేటర్లోనూ రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన అనుమతులు ఇస్తూ కొత్త జీవో జారీ చేసింది ప్రభుత్వం. కాకపోతే ఇందుకు నిర్దిష్ట సమయాన్ని సూచించింది.
ఉదయం 8 గంటల తర్వాత.. రాత్రి 1 గంట లోపే షోలు పూర్తి కావాలని.. రాత్రి 1 గంట నుంచి ఉదయం 8 వరకు షోలు వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇది ఇండస్ట్రీకి పెద్ద ఇబ్బందికర విషయమేమీ కాదు. ఐదో షోను మొన్నటిదాకా ఉదయం ఆరున్నర నుంచి 8 గంటల మధ్య మొదలుపెట్టేవారు. ఇకపై 8 నుంచే షోలు మొదలవుతాయి. ఇక ప్రతి సినిమాకూ వెళ్లి ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సిన అవసరం లేదు. డిమాండ్ ఉన్న ఏ సినిమాకైనా ఏ ఇబ్బందీ లేకుండా ఐదు షోలు వేసుకోవచ్చు.
This post was last modified on March 13, 2022 9:22 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…