Movie News

ప్రభాస్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా!

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి చాలా చోట్ల మిశ్రమ స్పందన వస్తోంది. మీడియాలో కూడా నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సినిమా తీసినా.. ఎమోషన్స్ మిస్ అయ్యాయని.. అలాంటి కథకు భారీ సెట్లు, ప్రభాస్ లాంటి హీరో అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా అయితే ఈ సినిమాను టార్గెట్ చేసిందనే చెప్పాలి. 

ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అయితే ఈ సినిమా బాలేదని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. చాలా మంది బాలీవుడ్ జనాలకు ఈ సినిమా నచ్చలేదు. కొందరు క్రిటిక్స్ అయితే ప్రభాస్ వయసుని ఎత్తిచూపిస్తున్నారు. ప్రముఖ రచయిత్రి, ఫిల్మ్ క్రిటిక్ అనుపమ్ చోప్రా ‘రాధేశ్యామ్’ సినిమాకి రివ్యూ ఇచ్చింది. ఆమె రివ్యూ చూస్తే కాస్త పర్సనల్ లెవెల్ లోకి వెళ్లి మరీ ఇచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. 

ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించింది. ఈ కాంబినేషన్ అనుపమ చోప్రాకి నచ్చలేదు. 42 ఏళ్ల వయసున్న ప్రభాస్ కి 52 ఏళ్ల భాగ్యశ్రీని తల్లిగా పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించింది. వయసు చూసుకొని రోల్స్ ఇవ్వాలంటూ సజెషన్ కూడా ఇచ్చింది. ఈమె రివ్యూ చూసిన మిగిలిన బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తూ రివ్యూ ఇచ్చారు. 

కొందరైతే భాగ్యశ్రీ.. ప్రభాస్ కి చెల్లిలా ఉందంటూ వెటకారంగా రాశారు. బాలీవుడ్ కి చెందిన భాగ్యశ్రీపై వారికి అభిమానం ఉండొచ్చు కానీ ఇలా ప్రభాస్ ని తక్కువ చేస్తూ ఆమె పొగడాల్సిన అవసరం లేదు. ఆ విషయానికొస్తే.. బాలీవుడ్ లో 60 ఏళ్లకు దగ్గర పడిన స్టార్ హీరోలు 20 ఏళ్ల ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుంటారు. మరి అప్పుడు ఏజ్ విషయం ఎందుకు మాట్లాడలేదో..? సినిమా ఇండస్ట్రీలో నటనకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని ముందు గ్రహించాలి.  

This post was last modified on March 12, 2022 6:55 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

9 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

44 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

48 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

1 hour ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago