Movie News

ప్రభాస్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా!

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి చాలా చోట్ల మిశ్రమ స్పందన వస్తోంది. మీడియాలో కూడా నెగెటివ్ రివ్యూలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో సినిమా తీసినా.. ఎమోషన్స్ మిస్ అయ్యాయని.. అలాంటి కథకు భారీ సెట్లు, ప్రభాస్ లాంటి హీరో అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ మీడియా అయితే ఈ సినిమాను టార్గెట్ చేసిందనే చెప్పాలి. 

ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అయితే ఈ సినిమా బాలేదని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. చాలా మంది బాలీవుడ్ జనాలకు ఈ సినిమా నచ్చలేదు. కొందరు క్రిటిక్స్ అయితే ప్రభాస్ వయసుని ఎత్తిచూపిస్తున్నారు. ప్రముఖ రచయిత్రి, ఫిల్మ్ క్రిటిక్ అనుపమ్ చోప్రా ‘రాధేశ్యామ్’ సినిమాకి రివ్యూ ఇచ్చింది. ఆమె రివ్యూ చూస్తే కాస్త పర్సనల్ లెవెల్ లోకి వెళ్లి మరీ ఇచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. 

ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించింది. ఈ కాంబినేషన్ అనుపమ చోప్రాకి నచ్చలేదు. 42 ఏళ్ల వయసున్న ప్రభాస్ కి 52 ఏళ్ల భాగ్యశ్రీని తల్లిగా పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించింది. వయసు చూసుకొని రోల్స్ ఇవ్వాలంటూ సజెషన్ కూడా ఇచ్చింది. ఈమె రివ్యూ చూసిన మిగిలిన బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఇదే పాయింట్ ను హైలైట్ చేస్తూ రివ్యూ ఇచ్చారు. 

కొందరైతే భాగ్యశ్రీ.. ప్రభాస్ కి చెల్లిలా ఉందంటూ వెటకారంగా రాశారు. బాలీవుడ్ కి చెందిన భాగ్యశ్రీపై వారికి అభిమానం ఉండొచ్చు కానీ ఇలా ప్రభాస్ ని తక్కువ చేస్తూ ఆమె పొగడాల్సిన అవసరం లేదు. ఆ విషయానికొస్తే.. బాలీవుడ్ లో 60 ఏళ్లకు దగ్గర పడిన స్టార్ హీరోలు 20 ఏళ్ల ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తుంటారు. మరి అప్పుడు ఏజ్ విషయం ఎందుకు మాట్లాడలేదో..? సినిమా ఇండస్ట్రీలో నటనకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని ముందు గ్రహించాలి.  

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

8 minutes ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

2 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

3 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

3 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

4 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

4 hours ago