Movie News

విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న క‌త్రినా కైఫ్‌

ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు వివిధ భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోయాయి. బాలీవుడ్ న‌టీన‌టులు త‌ర‌చుగా ద‌క్షిణాది చిత్రాల్లో న‌టిస్తున్నారు. సౌత్ ఆర్టిస్టులు వెళ్లి బాలీవుడ్ చిత్రాల్లో త‌ళుక్కుమంటున్నారు. ఇక ద‌క్షిణాదిన ఉన్న సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో అయితే అస‌లే ఈ హ‌ద్దులు లేవు. ఒక భాషకు చెందిన ఆర్టిస్టులు ఇంకో భాష‌లో తెర‌కెక్కుతున్న సినిమాల్లో న‌టించ‌డం కొత్తేమీ కాదు కానీ.. ఈ ఒర‌వ‌డి ఇప్పుడు బాగా పెరుగుతోంది.

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్లో ఒక ఆశ్చ‌ర్య‌క‌ర కాంబినేష‌న్లో సినిమా సెట్ అయింది. ఆ క‌ల‌యిక ఎవ్వ‌రూ ఊహించనిద‌నే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రైన క‌త్రినా కైఫ్‌కు జోడీగా త‌మిళ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి న‌టించనుండ‌టం విశేషం. జానీ గ‌ద‌ర్, బ‌ద్లాపూర్, అంధాదున్ లాంటి వైవిధ్య‌మైన థ్రిల్ల‌ర్ సినిమాల‌తో గొప్ప పేరు సంపాదించిన శ్రీరామ్ రాఘ‌వ‌న్ ఈ చిత్రాన్ని రూపొందించ‌నుండ‌టం విశేషం.

అంధాదున్ త‌ర్వాత శ్రీరామ్‌పై భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. కానీ ఈ చిత్రం త‌ర్వాత శ్రీరామ్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. బాగా క‌స‌ర‌త్తు చేసి త‌న కొత్త సినిమాకు స్క్రిప్టు రెడీ చేశాడు. మెర్రీ క్రిస్మ‌స్ పేరుతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. క‌త్రినా, విజ‌య్ సేతుప‌తి జోడీని జంట‌గా ఊహించుకోవ‌డ‌మే కష్టం.

అంత చిత్రంగా అనిపించే కాంబినేష‌న్ ఇది. మ‌రి ఈ క‌ల‌యిక‌లో శ్రీరామ్ ఎలాంటి సినిమా తీస్తాడ‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. త‌న సినిమాలో ముఖ్య పాత్ర‌ల‌కు విజ‌య్, క‌త్రినా త‌ప్ప వేరే ఛాయిసే క‌నిపించ‌లేద‌ని అంటున్నాడు శ్రీరామ్. ర‌మేష్ తౌరాని ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ప్ర‌ధానంగా హిందీలో ఈ సినిమాను తెర‌కెక్కించి తెలుగు, త‌మిళంలోనూ దీన్ని అనువాదం చేయ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

This post was last modified on March 8, 2022 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

1 hour ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago