రాజమౌళి సినిమాలో నటిస్తే ఏ యాక్టర్ కెరీర్ అయినా మలుపు తిరగాల్సిందే. ఇక హీరో హీరోయిన్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. మోస్ట్ వాంటెడ్ అయిపోతారు. ఆలియా భట్ విషయంలోనూ అదే జరుగుతోంది. నిజానికి ఆలియా ఆల్రెడీ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. కానీ ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకి టాలీవుడ్లోనూ టాప్ ప్రయారిటీ అయిపోయింది. ప్రతి స్టార్ హీరో సినిమా విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ సినిమాలో ఆలియా హీరోయిన్గా నటించబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆల్రెడీ కొరటాల శివ ఆమెతో మాట్లాడాడని, తను కూడా ఓకే అందనే ప్రచారం మొదలైంది. రీసెంట్గా ఓ సందర్భంలో దీని గురించి అడిగితే ఆలియా కూడా అది జరిగితే జరగొచ్చు అంది తప్ప కొట్టి పారేయలేదు. దాంతో ఆమె ఎన్టీఆర్తో జోడీ కడుతోందనే నమ్మకం వచ్చేసింది నందమూరి ఫ్యాన్స్కి. ఇప్పుడు మహేష్ బాబు మూవీ విషయంలోనూ ఆలియా పేరు బైటికొచ్చింది.
ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్కి వెళ్లనుంది. మరోవైపు రాజమౌళితో కూడా తనకి కమిట్మెంట్ ఉంది. ఈ చిత్రాన్ని కూడా వీలైనంత వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హీరోయిన్గా ఆలియా నటించనుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే చర్చలు ముగిశాయట. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని కూడా అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’లో చేసింది చిన్న పాత్రే అయినా ఆలియా పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయిపోయిన జక్కన్న.. ఈసారి తన సినిమాలో ఆమెని ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో చూపించాలని డిసైడయ్యాడట. అందుకే తనని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆయన అడిగితే ఎవరు మాత్రం కాదంటారు! ఆయన డైరెక్షన్లో నటించే చాన్స్ ఎవరు వదులుకుంటారు! అందుకే ఆలియా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇదే కనుక నిజమైతే ఇంతవరకు బాలీవుడ్లో ఓ రేంజ్లో వెలుగుతున్న ఆలియా ఇక టాలీవుడ్నీ షేక్ చేయడం ఖాయం.
This post was last modified on March 7, 2022 11:19 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…